KTR: పెట్రోల్, డీజిల్ పై 30 శాతం సెస్ తగ్గించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే వుంది. పెట్రోలియం కంపెనీలు ఏప్రిల్ 4 సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 40 పైసలు పెంచాయి. ఇంధన ధరల తాజా పెరుగుదల తర్వాత, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.81కి, డీజిల్ లీటరుకు రూ.94.07కి చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 118.81, డీజిల్ రూ. 103.04. చేరుకుంది. గత 14 రోజుల్లో 12వసారి చమురు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. నవంబర్ 4, 2021 నుంచి చమురు ధరలు దేశవ్యాప్తంగా స్థిరీకరించారు. దాదాపు ఒకటిన్నర నెలల తర్వాత అంటే మార్చి 22న మొదటిసారిగా ధరలు పెంచారు.
మార్చి 22 నుంచి ఏప్రిల్ 4 వరకు 14 రోజుల్లో 12 సార్లు చమురు ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. గత 14 రోజుల్లో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.8.40 పెరిగింది. మార్చి 21, 2022 వరకు ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.95.41 ఉండగా ప్రస్తుతం లీటరుకు రూ.103.81కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.36, డీజిల్ లీటరుకు రూ.99.44 గా ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.53గా ఉంది.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.103.60గా ఉంది. కరీంనగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.71గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.103.81గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 118.03గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.10కి పెరిగింది. హైదరాబాద్ తో పోలిస్తే ఏపీలో చమురు ధరలు ఎక్కువగానే వున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.118.55కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.90గా వుంది. ఒకేసారి 5 నుంచి 10 రూపాయలు పెంచకుండా. రోజూ లీటరుకి 40, 50 పైసలు పెంచుతూ తమ స్ట్రాటజీని అమలుచేస్తున్నాయి ఆయిల్ కంపెనీలు.
ఇదిలా వుంటే.. పెట్రో,డీజిల్ ధరలపై ట్విట్టర్లో కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో మేము గత 7 సంవత్సరాలలో (2015 జనవరి) VATని పెంచలేదు. ఇంధన ధరలను కనీసం 30% తగ్గించే ఎన్డిఎ ప్రభుత్వం విధించిన విచక్షణారహిత సెస్సులను తొలగించాలన్నది మా డిమాండ్ అన్నారు మంత్రి కేటీఆర్.
చైనీస్ హింస గురించి పుస్తకాలలో మాత్రమే చదవండి!
వరుసగా 14 రోజుల్లో 12 సార్లు పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు
అలాంటి హింసను అనేక రకాల రికార్డులను అధిగమించింది
నిర్మలా సీతారామన్ జీ, ముడిచమురు ధరలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్లమెంటులో చర్చకు ఎందుకు వెనుకాడుతున్నారు? అంటూ సూటిగా ప్రశ్నించారు కేటీఆర్.

Ktr Tweet
తాజావార్తలు
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!