Jupally Krishan Rao : తలతిక్క పనులు చేశారు కాబట్టే బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారు
- నా ఫోన్ను కూడా ట్యాప్ చేశారు
- మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
- కాళేశ్వరం కేసులో సమగ్ర విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : జూపల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupally Krishan Rao : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ, గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. తలతిక్క పనులే బీఆర్ఎస్ను తిరస్కరించేలా చేశాయి అని జూపల్లి వ్యాఖ్యానించారు. ఇలాంటివి ఆదర్శ పాలనకు దూరమైన చర్యలు. ప్రజాస్వామ్యంలో నైతిక విలువలకే అవమానం అని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు సహా ఇతర కీలక అంశాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే కాళేశ్వరం పై విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కమిషన్కు అవసరమైన అన్ని పత్రాలు సమర్పించబోతున్నామని అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిపథంలోకి తీసుకురావడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. “రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది. ఎలాంటి ఎన్నికలు జరిగినా, కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే నమ్మకం ఉంది” అని జూపల్లి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిపాలన ద్వారా మార్పులు తీసుకువస్తామని, పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అందరూ కలిసి కాంగ్రెస్ను బలోపేతం చేస్తామన్నారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
CIBIL Score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని ఉద్యోగం నుండి తొలగింపు.. హైకోర్టు మద్దతు
బీజేపీపై విమర్శలు చేస్తూ, “తెలంగాణకు బీజేపీ చేసినదేమీ లేదు. బీహార్, ఉత్తరప్రదేశ్కు అధిక నిధులు కేటాయిస్తూ, తెలంగాణకు మొండి చేయి చూపుతోంది. ఎటువంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు” అని మండిపడ్డారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పాత్రను గుర్తుచేస్తూ, “ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నష్టం జరిగినా, తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాలను చూసి మానవీయతతో సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారు” అని జూపల్లి గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ – “అవి ప్రజావ్యతిరేక పాలనలే. అవినీతి, కుటుంబ పాలన, అప్రజాస్వామిక విధానాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు” అని ధ్వజమెత్తారు. తాజా పరిస్థితిని ప్రస్తావిస్తూ – “రెవెన్యూలో తీవ్ర సమస్యలు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలను అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ పథకాల్ని కొనసాగిస్తూ ప్రజలపై నిబద్ధతను చూపిస్తున్నారు” అని మంత్రి వివరించారు.
Prashant Kishor: హీటెక్కుతున్న బీహార్ పాలిటిక్స్.. రాహుల్గాంధీకి సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!