Prashant Kishor: హీటెక్కుతున్న బీహార్ పాలిటిక్స్.. రాహుల్గాంధీకి సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్
- హీటెక్కుతున్న బీహార్ పాలిటిక్స్
- రాహుల్గాంధీకి సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమయ్యాయి. ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవల బీహార్లో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Electric Bike Explode: ఎలక్ట్రిక్ బైక్ పేలుడు.. మహిళ స్పాట్ డెడ్..!
Also Read
- CM Vijay: సీఎం విజయ్ 52వ బర్త్డే.. మోడీ, రాహుల్గాంధీ, స్టాలిన్ విషెస్
- Bengaluru: నీట్ రీ ఎగ్జామ్కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం
- West Bengal Budget 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ 20% పెంపు
- Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
తాజాగా జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్.. అధికార-ప్రధాన విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలనలో బీహార్ను కార్మికుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. గత 30-35 ఏళ్లుగా రాష్ట్రమంతా కార్మికుల రాష్ట్రంగా మారిందని పేర్కొన్నారు. ఇక్కడ బిడ్డల వీపుపై బస్తాలు మోయవలసి వస్తోందని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Story Board : తెలుగు రాష్ట్రాలు మత్తులో జోగుతున్నాయా..? యువతరం మేలుకోకపోతే చిత్తేనా..?
ఇక ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై ధ్వజమెత్తారు. రాబోయే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఎలా ఉంటాయన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి స్థానం లేదన్నారు. ఎన్ని ఓట్లు సాధిస్తుందో అంచనా వేయమని అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ.. లాలూ ఎన్ని సీట్లు ఇస్తే అంత అని చమత్కరించారు. ఈసారి పొత్తులతో కాకుండా సింగిల్గా పోటీ చేయాలని రాహుల్గాంధీకి ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. రాహుల్గాంధీకి దమ్ము, ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేసి సీట్లు సాధించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి.. ఆర్జేడీ నేతృత్వంలోని ఇండియా కూటమికి సవాల్ విసిరారు.
ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఏదొక రోజున ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ 52వ బర్త్డే.. మోడీ, రాహుల్గాంధీ, స్టాలిన్ విషెస్
-
Vaibhav Sooryavanshi: ఆ బ్యాటింగ్ స్టైలే వైభవ్కు శాపమా..? ఊహించని ప్రమాదంలో సూర్యవంశీ..
-
JD Vance: స్విట్జర్లాండ్లో జేడీ వాన్స్కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
-
Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
-
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!