Prashant Kishor: హీటెక్కుతున్న బీహార్ పాలిటిక్స్.. రాహుల్గాంధీకి సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్
- హీటెక్కుతున్న బీహార్ పాలిటిక్స్
- రాహుల్గాంధీకి సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమయ్యాయి. ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవల బీహార్లో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Electric Bike Explode: ఎలక్ట్రిక్ బైక్ పేలుడు.. మహిళ స్పాట్ డెడ్..!
Also Read
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
తాజాగా జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్.. అధికార-ప్రధాన విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలనలో బీహార్ను కార్మికుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. గత 30-35 ఏళ్లుగా రాష్ట్రమంతా కార్మికుల రాష్ట్రంగా మారిందని పేర్కొన్నారు. ఇక్కడ బిడ్డల వీపుపై బస్తాలు మోయవలసి వస్తోందని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Story Board : తెలుగు రాష్ట్రాలు మత్తులో జోగుతున్నాయా..? యువతరం మేలుకోకపోతే చిత్తేనా..?
ఇక ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై ధ్వజమెత్తారు. రాబోయే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఎలా ఉంటాయన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి స్థానం లేదన్నారు. ఎన్ని ఓట్లు సాధిస్తుందో అంచనా వేయమని అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ.. లాలూ ఎన్ని సీట్లు ఇస్తే అంత అని చమత్కరించారు. ఈసారి పొత్తులతో కాకుండా సింగిల్గా పోటీ చేయాలని రాహుల్గాంధీకి ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. రాహుల్గాంధీకి దమ్ము, ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేసి సీట్లు సాధించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి.. ఆర్జేడీ నేతృత్వంలోని ఇండియా కూటమికి సవాల్ విసిరారు.
ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఏదొక రోజున ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
-
Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..