Minister Jagadish Reddy: కొంగ, దొంగ జపాలకు తెలంగాణా ప్రజలు నమ్మరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jagadish Reddy: కొంగ , దొంగ జపాలకు తెలంగాణా ప్రజలు నమ్మరని మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్, బీజేపీ లు చేస్తున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలపై ఆయన స్పందించారు. 9 సంవత్సరాల కేసీఆర్ జనరంజక పాలనలో అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణా సాధించిన ప్రగతి దేశానికి చాటేందుకు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నామన్నారు. తెలంగాణా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఊహకు మించి అభివృద్ధి సాధించామని తెలిపారు. ఆరు దశబ్దాలుగా తెలంగాణాను చీకట్లోకి నెట్టిన కాంగ్రెస్, తెలంగాణా అభివృద్ధిని నిరోధించే బీజేపీలు ఏమని పోటీ ఉత్సవాలు చేస్తాయమని పేర్కొన్నారు. కేవలం ఓట్లు, అధికారం పరమావధిగా రెండు పార్టీల తీరు కనిపిస్తుందని అన్నారు. దేశ వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్ ఫెయిల్యూర్ పార్టీ వారు ఫెయిల్యూర్ సభలే చేసుకోవాలని మండిపడ్డారు. కిషన్ రెడ్డి తెలంగాణపై మాట్లడితే ప్రజలు నవ్వుకుంటారని అన్నారు. వచ్చిన తెలంగాణా ప్రకటన వెనక్కి తీసుకుంటే రాజీనామాకు భయపడ్డ వారు తెలంగాణ గురించి ఏం మాట్లాడుతారు? అంటూ ప్రశ్నించారు.
Read also: PVP Tweets: నీ బిల్డప్ ఏందయ్యా కేశినేని నాని.. అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అనుకుంటున్నావా..
Also Read
- Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
- Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
కాంగ్రెస్, బీజేపీలు ఓట్ల రాజకీయం కోసమే పోటీ ఉత్సవాలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణా ప్రయోజనాలు తాకట్టు పెట్టిన మోడీ ఏడు మండలాలు ఆంధ్రాలో విలీనం చేశాడని మండిపడ్డారు. కాంగ్రెస్ , బీజేపీ లు తెలంగాణా కోసం ఏ లాభం చేకూర్చారో ప్రజలకు చెప్పాలి? అంటూ ప్రశ్నించారు. కొంగ , దొంగ జపాలకు తెలంగాణా ప్రజలు నమ్మరని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి ఆవిర్భావ వేడుకలు చేసుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాలో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సహా ఏడు మండలాలను కలిపిన పార్టీకి తెలంగాణపై మాట్లాడే అర్హత ఎక్కడిదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామా చేస్తానని పారిపోయిన కిషన్ రెడ్డి. తొమ్మిదేళ్లలో ఊహకు అందని అభివృద్ధి చేసినందుకే దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పరిణామాలన్నింటిలో భాగస్వాములైన బీఆర్ఎస్ శ్రేణులు దశాబ్ధ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో బల్బులు వెలుస్తున్నాయన్నారు. వసూళ్లలో సాధించిన విజయాలే సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు.
Uttarakhand : ఉత్తరాఖండ్లో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు
తాజావార్తలు
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!