Indrakaran Reddy: మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఇంద్రకిరణ్ సవాల్.. ఏ శిక్షకైనా సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Indrakiran Reddy Challenges Maheshwar Reddy: మున్సిపల్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తాజాగా మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి స్పందించారు. ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలుంటే బయటపెట్టమని సవాల్ చేశారు. తనపై చేసిన ఆరోపణల్ని ఆధారాలతో సహా నిరూపిస్తే.. చట్టప్రకారం తాను ఏ శిక్షనైనా ఎదుర్కోవడానికి సిద్ధమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో మహేశ్వర్ రెడ్డి పనైపోయిందని.. రేపోమాపో పార్టీ మారడం ఖాయమని అన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నందుకు.. మహేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారని, ఆరోపణలపై రుజువులు చూపాలని కోరారని చెప్పారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తే.. ఆ అంశంపై మహేశ్వర్ రెడ్డి గానీ, ఆ పార్టీ కార్యకర్తలు గానీ స్పందించలేదన్నారు. కానీ.. మహేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేస్తే మాత్రం.. కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దుపై మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ స్పందించిందని, కానీ కాంగ్రెస్ మాత్రం నిస్సహాయ స్థితిలో ఉందని పేర్కొన్నారు.
Vemula Prashanth Reddy: ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకిరణ్ మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలందరూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, ప్రజల గురించి గొప్పగా ఆలోచించే వ్యక్తి మనకు సీఎంగా ఉండటం అందరి అదృష్టమని చెప్పారు. కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేసి.. మరోసారి పార్టీకి అఖండ విజయం అందించాలని కోరారు. గత తొమ్మిదేళ్లలో రైతు సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో వరిసాగు రెట్టింపు అయ్యిందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ప్రతినెలా పెన్షన్తో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి కానుకలను కేసీఆర్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. రైతులు, సామాన్య ప్రజల ఆదాయాన్ని పెంచడం కోసం కేసీఆర్ సర్కార్ కృషి చేస్తుంటే.. మోడీ ప్రభుత్వం మాత్రం అన్ని వస్తువుల ధరల్ని పెంచుతూ సామాన్యులపై మోయలేని భారాన్ని మోపుతోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరల్ని పెంచుతోందని.. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!