Indrakaran Reddy: మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఇంద్రకిరణ్ సవాల్.. ఏ శిక్షకైనా సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Indrakiran Reddy Challenges Maheshwar Reddy: మున్సిపల్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తాజాగా మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి స్పందించారు. ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలుంటే బయటపెట్టమని సవాల్ చేశారు. తనపై చేసిన ఆరోపణల్ని ఆధారాలతో సహా నిరూపిస్తే.. చట్టప్రకారం తాను ఏ శిక్షనైనా ఎదుర్కోవడానికి సిద్ధమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో మహేశ్వర్ రెడ్డి పనైపోయిందని.. రేపోమాపో పార్టీ మారడం ఖాయమని అన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నందుకు.. మహేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారని, ఆరోపణలపై రుజువులు చూపాలని కోరారని చెప్పారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తే.. ఆ అంశంపై మహేశ్వర్ రెడ్డి గానీ, ఆ పార్టీ కార్యకర్తలు గానీ స్పందించలేదన్నారు. కానీ.. మహేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేస్తే మాత్రం.. కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దుపై మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ స్పందించిందని, కానీ కాంగ్రెస్ మాత్రం నిస్సహాయ స్థితిలో ఉందని పేర్కొన్నారు.
Vemula Prashanth Reddy: ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకిరణ్ మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలందరూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, ప్రజల గురించి గొప్పగా ఆలోచించే వ్యక్తి మనకు సీఎంగా ఉండటం అందరి అదృష్టమని చెప్పారు. కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేసి.. మరోసారి పార్టీకి అఖండ విజయం అందించాలని కోరారు. గత తొమ్మిదేళ్లలో రైతు సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో వరిసాగు రెట్టింపు అయ్యిందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ప్రతినెలా పెన్షన్తో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి కానుకలను కేసీఆర్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. రైతులు, సామాన్య ప్రజల ఆదాయాన్ని పెంచడం కోసం కేసీఆర్ సర్కార్ కృషి చేస్తుంటే.. మోడీ ప్రభుత్వం మాత్రం అన్ని వస్తువుల ధరల్ని పెంచుతూ సామాన్యులపై మోయలేని భారాన్ని మోపుతోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరల్ని పెంచుతోందని.. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..