Harish Rao: పక్క రాష్ట్రాలు, దేశాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao Speech In Siddhipet Public Meeting: తెలంగాణ రాష్ట్రం.. పక్క రాష్ట్రాలు, దేశాలకు అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కువగా వరి పండిస్తున్న రాష్ట్రం.. తెలంగాణ రాష్ట్రమేనని చెప్పారు. సిద్దిపేటలో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు కోసం ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. కరువు పాటలు పాడుకున్న ఈ నేలలో ఇప్పుడు కాళేశ్వరం జలాలు పారుతున్నాయని అన్నారు. దేశంలో భూగర్భ జలాలు పడిపోతుంటే.. తెలంగాణలో ఏడున్నర మీటర్ల భూగర్భ జలాలు పైకి వచ్చాయని చెప్పారు. బతకబోయిన పాలమూరుకు బతకడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారన్నారు. సిద్దిపేట నుంచి త్వరలోనే తిరుపతికి, బెంగళూరుకి ట్రైన్ సదుపాయం వస్తుందన్నారు. అంతేకాదు.. సిద్దిపేటలో త్వరలోనే ఆర్టిఫిషియల్ బీచ్ కూడా నిర్మిస్తామన్నారు.
TDP and BJP: ఏపీలో మారుతున్న బీజేపీ నేతల స్వరం.. గతంలో విమర్శలు, నేడు కూల్ కామెంట్స్
Also Read
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
అంతకుముందు.. మునిపల్లి మండలం చిన్న చల్మెడ శివారులో సంగమేశ్వర ఎత్తిపోతల పంపు హౌజ్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే బాగుంటుందని.. వేరే వాళ్ళ చేతికి పోతే ఆగం అవుతుందని అన్నారు. పేదలు, రైతులు సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. సంగమేశ్వర పథకానికి భూములిచ్చిన రైతుల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందని, రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని కోనసీమగా మారుస్తామని మాటిచ్చారు. తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడం వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇవ్వడంతో పాటు జహీరాబాద్, నారాయణఖేడ్ ఆసుపత్రులను అభివృద్ధి చేశామన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా అందిస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..