కిషన్ రెడ్డి వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నారు : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిమ్స్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో మారు తప్పుడు ప్రచారం అని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నారు. మొన్ననేమో ఎయిమ్స్ కి భూమి ఇవ్వలేదని ఆరోపణ చేశారు. సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్ చూపించాం. ఇప్పుడేమో బిల్డంగ్ డాక్యుమెంట్స్, ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ అంటున్నారు. రోజుకో తీరుగా మాట్లాడుతున్నారు. ఎయిమ్స్ విషయంలో ఈ ఏడాది అక్టోబర్9 న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కి కేంద్రం లేఖ రాసింది. దీన్ని సంబంధిత శాఖలతో సమన్వయం చేసి వారం రోజుల్లో టీఓఆర్ ఇచ్చేలా కృషి చేసింది.
తెలంగాణ ప్రభుత్వం పట్టింపులకు పోకుండా భూమిని అప్పగించాలి అని కిషన్ రెడ్డి అనడం విస్మయం కలిగిస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 201 ఎకరాల భూమిని ఎయిమ్స్ కి అప్పగించింది. దానికి సంబంధించిన వివరాలను ఇప్పటికే మీడియా సాక్షిగా విడుదల చేశాం. వైఎస్సార్ హయాంలో ఇప్పుడున్న ఎయిమ్స్ బీబీ నగర్ నిర్మాణ0 జరిగింది… ఎయిమ్స్ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కట్టలేదు.. అని కిషన్ రెడ్డి అంటున్నారు.వాస్తవం ఏంటంటే.. అప్పుడు పాక్షికంగా మాత్రమే జరిగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభు్త్వం రు. 45 కోట్లు ఖర్చు చేసి (జీవో నెం.443, 10-05-2017 ద్వారా రు. 5కోట్లు, జీవో నెంబర్ 632, 12-10-2017 ద్వారా రు.40 కోట్లు) ఆసుపత్రిని వినియోగంలోకి తెచ్చింది. ఓపీ, డయాగ్నోస్టిక్ సేవలను ప్రారంభించింది.
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
తెలంగాణ సాధన తరువాత ఆరోగ్య వ్యవస్థను పటిష్టీకరించడంలో భాగంగా తెలంగాణ కు ఎయిమ్స్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి పలు మార్లు ముఖ్య మంత్రి గారు స్వయంగా వినతి చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల లో భవన నిర్మాణం జరుగుటకు 2-3 సంవత్సరాల సమయం పట్టడం వలన ఆయా రాష్ట్రాల లో తరగతులు ప్రారంభించడం ఆలస్యం అయ్యింది. కానీ తెలంగాణ లో నిమ్స్ కొరకు తయారు చేయబడిన భవన నిర్మాణ సముదాయాలను AIIMS కు బదిలీ చేయడం వలన తెలంగాణ లో వెనువెంటనే తరగతులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎయిమ్స్ విస్తరణ ఇబ్బందికరంగా మారిందనడం పచ్చి అబద్ధం. తెలంగాణ ప్రభుత్వం అవసరమైన భూమిని అప్పజెప్పడంతో పాటు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సహా అన్ని రకాల అనుమతులను అడిగిన వెంటనే మంజూరు చేసింది. నేను అబద్ధాలు మాట్లాడటం లేదంటూనే కిషన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని తప్పుడు ఆరోపణ చేస్తున్నారు.
అసలు వాస్తవం ఏంటంటే… మెడికల్ కాలేజీలు తెలంగాణకు సాంక్షన్ చేయాలని ఏడేండ్ల నుంచి కేంద్రాన్ని కోరుతున్నది. కేంద్ర ఆరోగ్య మంత్రులు నడ్డా, హర్షవర్ధన్కు పలు మార్లు విన్నవించుకున్నది. తాజాగా కూడా మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి అడిగింది. అయినా కేంద్రం పట్టించుకోలేదు. Phase-1, Phase – 2 లో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదు. Phase – 3 లో ఉన్న నిబంధనల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లేకుండా చేశారు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Gill Century Celebration: శుభ్మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
-
GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
-
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
-
Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
-
Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..