Harish rao: తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఢిల్లీ ఇబ్బంది పెడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలోని రెడ్డి భవన్ లో గీత కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేకనే కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆయన అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రూ. 4 వేల కోట్లు జీఎస్టీ కింద రావాలని.. 15 వ ఆర్థిక సంఘం రూ. 6 కోట్లు ఇవ్వాలని .. 14 వ ఆర్థిక సంఘం కింద రూ. 1300 కోట్లు రావాలని ఆయన తెలిపారు. పీఆర్జీఎఫ్ నుంచి రూ. 1900 కోట్లు రావాలి.. ఇవన్నీ కావాలనే ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేంద్ర, నరేంద్రమోదీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు. ఇటీవల హైదరాబాద్ టూర్ కు వచ్చిన మోదీ, టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. కుటుంబ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ మంత్రులు, ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు సీఎం కేసీఆర్, ప్రధాని మోదీకి స్వాగతం చెప్పకపోవడంపై ఫైర్ అవుతున్నారు. మోదీ అంటే భయపడే కేసీఆర్ బెంగళూర్ వెళ్లారని విమర్శిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో పీఎం మోదీకి 8 ప్రశ్నలు సంధిస్తూ నిలదీశారు.
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
ఇదిలా ఉంటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. 2023లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటీవల వరసగా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలు తెలంగాణలో పర్యటించారు. దీనిని బట్టి తెలుస్తోంది బీజేపీ తెలంగాణకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అని. ఇదిలా ఉంటే తెలంగాణకు చెందిన కే. లక్ష్మణ్ కు యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ. దీన్ని బట్టి పార్టీలో పని చేస్తే పదవులు వస్తాయనే సందేశాన్ని పంపించింది. దీంతో రానున్న రోజుల్లో పార్టీలో చేరిన వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామనే చెప్పకచెబుతోంది.
తాజావార్తలు
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్రూఫ్, 6 ఎయిర్బ్యాగ్స్తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్తో హీరో ఫైట్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!