Harish rao: తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఢిల్లీ ఇబ్బంది పెడుతోంది
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలోని రెడ్డి భవన్ లో గీత కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేకనే కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆయన అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రూ. 4 వేల కోట్లు జీఎస్టీ కింద రావాలని.. 15 వ ఆర్థిక సంఘం రూ. 6 కోట్లు ఇవ్వాలని .. 14 వ ఆర్థిక సంఘం కింద రూ. 1300 కోట్లు రావాలని ఆయన తెలిపారు. పీఆర్జీఎఫ్ నుంచి రూ. 1900 కోట్లు రావాలి.. ఇవన్నీ కావాలనే ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేంద్ర, నరేంద్రమోదీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు. ఇటీవల హైదరాబాద్ టూర్ కు వచ్చిన మోదీ, టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. కుటుంబ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ మంత్రులు, ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు సీఎం కేసీఆర్, ప్రధాని మోదీకి స్వాగతం చెప్పకపోవడంపై ఫైర్ అవుతున్నారు. మోదీ అంటే భయపడే కేసీఆర్ బెంగళూర్ వెళ్లారని విమర్శిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో పీఎం మోదీకి 8 ప్రశ్నలు సంధిస్తూ నిలదీశారు.
Also Read
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
ఇదిలా ఉంటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. 2023లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటీవల వరసగా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలు తెలంగాణలో పర్యటించారు. దీనిని బట్టి తెలుస్తోంది బీజేపీ తెలంగాణకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అని. ఇదిలా ఉంటే తెలంగాణకు చెందిన కే. లక్ష్మణ్ కు యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ. దీన్ని బట్టి పార్టీలో పని చేస్తే పదవులు వస్తాయనే సందేశాన్ని పంపించింది. దీంతో రానున్న రోజుల్లో పార్టీలో చేరిన వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామనే చెప్పకచెబుతోంది.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీకి నేతలకు సజ్జల హెచ్చరికలు
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
-
Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
-
Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!