Harish Rao: కర్ణాటక ఎన్నికలపై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ ప్రభుత్వమే రావాలంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao: కర్ణాటక ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ ఎన్నికలను చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి హరీష్ రావు కర్ణాటక ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాస్ట్రంలో తామంతా వెళ్లి ప్రచారం చేస్తామని అన్నారు. కర్ణాటకలో మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రలో మంచి స్పందన వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల తర్వాత పనిచేస్తామని అన్నారు. తెలంగాణ దేశానికి మోడల్ అని అన్నారు.
Read Also: MI vs KKR: ఇషాన్, సూర్యకుమార్ యాదవ్ మెరుపులు.. కేకేఆర్పై ముంబై ఇండియన్స్ గెలుపు
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మన తెలంగాణ పథకాలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. సిద్ధిపేటలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు తమ రాష్ట్రాల్లో రావాలని కోరుకుంటున్నారని అన్నారు. మన సిద్ధిపేటలో కూడా వచ్చే రోజుల్లో సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని అన్నారు. డబుల్ బెడ్రూం అర్హులందరికి ఇస్తామని అన్నారు. మనం అంతా కలిసి సిద్ధిపేటను అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని అన్నారు.
మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఫలితాలు వెలువడుతాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికారం నిలుపుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఈ సారి అధికారంలోకి రావాలని అనుకుంటోంది. జేడీయూ పార్టీ కూడా కింగ్ కాకున్నా కింగ్ మేకర్ పాత్ర అయినా పోషించాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే కన్నడ ప్రజలు మాత్రం ఈ సారి కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వరని, మళ్లీ హంగ్ తప్పదని ఫ్రీ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికలకు మరికొన్ని రోజులు సమయం ఉండటంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీతో జేడీయూ నేత కుమారస్వామికి మంచి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణను అనుకుని ఉన్న కన్నడ జిల్లాల్లో టీఆర్ఎస్ పనితీరు ఎంతో కొంత పరిచయం ఉంటుందని, అది జేడీయూకు లాభిస్తుందని భావిస్తున్నారు.
- Tags
- bjp
- BRS
- congress
- harish rao
- JDU
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!