అపవిత్ర పొత్తుతో ఉన్న అభ్యర్థికి ఓటర్లు మద్దతు ఇవ్వలేదు: గంగుల కమలాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడంతో మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్జిల్లాలో ఎస్ ఆర్ఆర్ కాలేజీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు.అపవిత్ర పొత్తుతో ఉన్న అభ్యర్థికి ఓటర్లు మద్దతు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ బలపర్చిన భానుప్రసాద్, ఎల్. రమణలకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మంత్రి గంగుల కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవం కావాల్సిన స్థానాలను ఎన్నికల వరకు తీసుకెళ్లారన్నారు. 1324 ఓట్లలో 1063 ఓట్లు టీఆర్ఎస్కు పడ్డాయన్నారు.
ఇతర పార్టీల ఓట్లు 324 ఉండగా 934 ఓట్లు టీఆర్ఎస్వి ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ మీద కడుపు మంటతో అక్రమ పొత్తుతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల ఓ అభ్యర్థిని పెట్టారని ఆయన విమర్శించారు. కేసీఆర్ బలగము, బలం చూపించలేదని కేవలం క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటే ఏంటో నిరూపించామన్నారు. ఉమ్మడి పార్టీల అభ్యర్థికి ఉన్న 324 ఓట్లలో ఎన్ని పడ్డాయో తెలుస్తుందన్నారు.105 బీజేపీ ఓట్లు ఎవ్వరికి పడ్డాయి. బండి సంజయ్ అభ్యర్థిని పెట్టలేదు అంటే ఈటెల అభ్యర్థిని పెట్టమన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఓట్లు 86 ఓట్లు టీఆర్ఎస్ కు క్రాస్ అయ్యాయన్నారు. కాంగ్రెస్ బీజేపీలు కలిసిన చరిత్ర ఒక్క కరీంనగర్లోనే నెలకొందని విమర్శించారు. తెలంగాణ గడ్డమీద ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్కు మాత్రమే ఉందన్నారు. రెండు ఎన్నికల్లో సునాయాసంగా గెలిపించిన ప్రజా ప్రతినిధులకు గంగుల ధన్యవాదాలు తెలిపారు.
Also Read
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
మరోసారి అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్కు ధన్యవాదాలు: ఎమ్మెల్సీ, భాను ప్రసాద్
ఎమ్మెల్సీగా మూడో సారి గెలిచిన భానుప్రసాద్ కేసీఆర్, కేటీఆర్లకు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గెలుపు టీఆర్ఎస్ సమిష్టి విజయమని పేర్కొన్నారు. రెండు స్థానాలు మెదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవడం ఆనందం కలిగించిందన్నారు. నాపై అనేక దుష్ప్రచారం చేశారు..అయినా ప్రజా ప్రతినిధులు నాకు మద్దతు ఇచ్చారని వారికి ఎల్లప్పుడు రుణ పడి ఉంటానన్నారు.
జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్సీ, రమణ
ఎమ్మెల్సీగా గెలిచిన ఎల్. రమణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలియ జేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో నిరంతరం నిబద్ధతతో పనిచేస్తానన్నారు. అంతే కాకుండా జిల్లా అభివృద్ధికి అందరితో కలిసి పనిచేస్తానని వెల్లడించారు.
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..