ACB: వైద్యఆరోగ్యశాఖలో అవినీతి జలగలు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Officer caught by ACB while taking bribe: వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి జలగలు జనాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఎంత మంది ఏసీబీకి పట్టుబడినా ఎన్ని అరెస్టులు జరిగినా ఏ మాత్రం జంకడం లేదు. గతంలో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడితే కేసు తేలే వరకు ఏళ్లు గడిచేది. కానీ ప్రస్తుత రోజుల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడితే ఏమంత నేరం కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అవినీతి నిరోధకశాఖ అధికారుల చేతిలో అరెస్టయిన 6 నెలలు లేదా ఏడాదిలోగా మళ్లీ సేమ్ పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు. ఓ ఏడాది తర్వాత మళ్లీ లాభదాయకమైన ప్రాంతాల్లోకి మారుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఏ చిన్న పని కోసం వెళ్లినా పైసల్ లేనిదే పని జరగడం లేదు.
Read also: Mexico Shooting: బార్లో కాల్పుల కలకలం.. 9 మంది మృతి
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
లంచం ఇచ్చుకోలేని వారు అధికారుల చుట్టూ చెప్పులరిగే తిరగాల్సిందే. అలా తిరిగినా పని అవుతుందన్న నమ్మకమూ లేదు. ఇలాంటి ఘటనే నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. నారాయణపేటలో వైద్యఆరోగ్యశాఖలో అవినీతి జలగలు బయటపడ్డారు. హనుమంతు అనే అధికారి పాతిక వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. హనుమంతును విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి రవడంతో షాక్ తిన్న ఏసీబీ అధికారులు. DM&HO రాం మనోహర్ సూచన మేరకే డబ్బులు డిమాండ్ చేసినట్లు హనుమంతు అధికారుల ముందు ఒప్పుకున్నాడు. ఆసుపత్రుల నుంచి నెల వారి మామూళ్లు, సిబ్బంది పోస్టింగ్ ల నుంచి వసూళ్లలో కీలకం హనుమంతే అని నిర్ధారించారు. హనుమంతుని రాత్రి 2 గంటల వరకు సాగిన విచారించారు అధికారులు. DM&HO రాం మనోహర్ పై శాఖాపరమైన విచారణ కొనసాగుతుంది.
Read also: Mexico Shooting: బార్లో కాల్పుల కలకలం.. 9 మంది మృతి
నారాయణపేట జిల్లాలోని డీఎంఅండ్హెచ్వో కార్యాలయంపై గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈనేపథ్యంలో.. కోస్గీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతి కోసం జిల్లా వైద్యశాఖ మాస్ మీడియా అధికారి హన్మంతు రూ.80 వేలను డిమాండ్ చేశాడు. అయితే.. బాధితుడు, ప్రైవేట్ ఆస్పత్రి మేనేజర్ కలాల ఆంజనేయులు గౌడ్ ఏసీబీని ఆశ్రయించాడు. అయితే.. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో బాధితుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అతడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.అతడిపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Moinabad Episode: రెండో రోజు కస్టడీ.. కీలకం కానున్న ఎఫ్ఎస్ఎల్ నివేదిక
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!