Etela Rajender: 25 ఏళ్ల జీవితంలో ఎవరిపై చేయి చేసుకోలేదు.. న్యాయం కోసం తప్పలేదు
- రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన ఘటనపై ఎంపీ ఈటల క్లారిటీ
- 25 ఏళ్ల జీవితంలో ఎవరిపై చేయి చేసుకోలేదు- ఎంపీ ఈటల
- కానీ ఈ రోజు న్యాయం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చింది- ఈటల రాజేందర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉదయం ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. 25 ఏళ్ల జీవితంలో ఎవరిపై చేయి చేసుకోలేదని ఈటల అన్నారు. కానీ ఈ రోజు న్యాయం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలో 149 ఎకరాల్లో ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది.. 1985లో ఆనాడు వివిధ సంస్థలలో పనిచేసే చిన్న ఉద్యోగులు ఈ లాండ్ కొనుగోలు చేశారని అన్నారు. 2006లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి మోసం చేసేందుకు చూశారు.. కానీ కోర్ట్ కూడా రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ తప్పని డిస్మిస్ చేసిందని ఎంపీ ఈటల పేర్కొన్నారు. 2011లో మరోసారి కాజేసే ప్రయత్నం చేశారు.. కొంతమంది అధికారులతో కలిసి DPO సహకారంతో.. ధరణిని ఆసరాగా చేసుకుని మళ్ళీ లాండ్ కాజేసే యత్నం చేశారని ఈటల రాజేందర్ తెలిపారు. ప్లాట్ ఓనర్స్ ఇళ్లు కట్టుకుందామంటే అనుమతులు రావడం లేదు.. రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యంగా ప్లాట్స్ యజమానులను వేధిస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: Talasani Srinivas: రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించాం..
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Terrorist Arrest: మేడ్చల్లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
- Fire Accident : మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఓమ్నీ వ్యాన్
- Hyderabad: తమపై చట్నీ పడేశాడని దారుణం.. అర్ధరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లతో కాల్చి హత్య..
ఓ బాధితుడు తన ఇళ్ళు కట్టుకుంటుంటే కూల్చివేశారు.. అతను చూపిద్దామంటే అక్కడికి వెళ్ళానని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. అక్కడ కొంతమంది రౌడీలు అక్కడ మద్యం సేవిస్తూ.. హంగామా చేశారు.. తనను చూసి చులకనగా మాట్లాడాడు.. అందుకే ప్రజల పక్షాన వాడిపై చేయి చేసుకున్నానని అన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో.. వారి ప్రతినిధిగా వారికి న్యాయం చేసేందుకు తాను పోరాటం చేస్తానని చెప్పారు. వారిపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్కి సైతం జరిగిన విషయం వివరిస్తానని తెలిపారు. కోర్టులలో న్యాయం దక్కినా కూడా స్థానికంగా వీరికి న్యాయం జరగడం లేదని వాపోయారు. వారికి న్యాయం చేయాలని కోరుతున్నాను.. ప్రభుత్వం స్పందించాలి, వీరికి న్యాయం చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
Read Also: Laila : విశ్వక్ “లైలా” నుంచి రెండో సాంగ్ వచ్చేస్తోంది
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలో పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఉదయం అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. పార్టీ కార్యకర్తలు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ పై దాడి చేశారు. ఏకశిలానగర్లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ఎస్టేట్ బ్రోకర్లపై ఎంపీ ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!