Eatala Rajendar: దుండిగల్లో అసైన్డ్ భూముల ఆందోళన.. అధికారులపై ఎంపీ ఈటల ఫైర్
- దుండిగల్ లో అసైన్డ్ భూముల వద్ద రైతుల ఆందోళన..
- బాధితులకు అండగా నిలిచిన ఎంపీ ఈటల రాజేందర్..
- ఈ భూమి మీ తాత జాగీరు కాదంటూ ముఖ్యమంత్రికి ఈటల హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eatala Rajendar: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ దుండిగల్ గ్రామంలో సర్వే నెంబర్ 453, 454 లలో ఉన్న లవాణి పట్టా 450 ఎకరాల భూమిలో కొంత స్థలంలో డబుల్ బెడ్ రూమ్స్ నిర్మించారు. మిగతా 410 ఎకరాల్లో ఉన్న రైతులకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సర్వే నంబర్లలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 600 మందికి 60 గజాల ఇందిరమ్మ పట్టాలు కూడా ఇచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ భూమికి పట్టాలు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ కూడా ఇచ్చారనీ.. ఇప్పుడు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారనీ.. తెలియడంతో అక్కడికి వెళ్ళిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రైతులకు అండగా నిలిచారు.
Read Also: Pottel : రివ్యూ రైటర్స్ పై శ్రీకాంత్ అయ్యంగార్ దారుణ వ్యాఖ్యలు
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Terrorist Arrest: మేడ్చల్లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
- Fire Accident : మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఓమ్నీ వ్యాన్
- Hyderabad: తమపై చట్నీ పడేశాడని దారుణం.. అర్ధరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లతో కాల్చి హత్య..
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఈ భూముల్లో 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు.. ఈ భూముల్ని ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.. ఏమనుకుంటున్నారు?.. కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలానే చేసి నాశనం అయింది.. అసైన్డ్ భూములను ఇష్టం వచ్చినట్లు లాక్కొనే అధికారం ఎవరికి లేదు.. రింగ్ రోడ్డు అప్పుడు కూడా ఇలానే అసైన్మెంట్ భూములకు రూపాయి ఇవ్వకుండా గుంజుకుంటుంటే రాజశేఖర్ రెడ్డితో కొట్లాడాం.. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు కూడా నష్టపరిహారం ఇచ్చే వరకు వదిలి పెట్టలేదని చెప్పారు. ప్రభుత్వానికి అవసరమైతే అది కూడా ప్రజల కోసం అయితే నష్ట పరిహారం ఇచ్చి తీసుకోవాలి.. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు.. గద్దల్లాగా వచ్చి ప్రజల్ని అదరగొట్టి బెదరగొట్టి పోలీసుల సహాయంతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మంచిగా ఉండదు.. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా.. అసైన్డ్ భూములు ఒక్క సంవత్సరం కోసం ఇవ్వరు.. తాత జాగీర్ లాగా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
Read Also: Baba Siddique : బాబా సిద్ధిఖీ హత్య కేసులో పాకిస్థాన్కు సంబంధం.. డ్రోన్ ద్వారా ఆయుధాల ఆర్డర్
ఇక, అవసరమైతే ప్రజల తరపున నేనే కోర్టుకు పోతాను అని ఈటల రాజేందర్ తెలిపారు. దద్దమ్మల లెక్క ఉంటే గద్దల లెక్క తనకు పోతారు.. అనేక రాష్ట్రాల్లో15 ఏళ్లు దాటిన తర్వాత అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు ఇచ్చేస్తారు.. తమిళనాడు, యూపీలో ఇలాగే చేశారు.. కేసీఆర్ కూడా ఇస్తానని ఇవ్వలేదు.. కడు బీదరికంలో ఉన్న వారికి ఈ భూమి ఇచ్చారు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరించమని కాదు మీకు ఓట్లు వేసింది.. నేను మీ వెంట ఉంటా.. భూములు గుంజుకుంటె చూస్తూ ఊరుకునేది లేదు.. పేదలను వేధించే అధికారం ఎవరికీ లేదు.. వారికి ఎవరూ దిక్కులేదని అనుకోవద్దు.. ఈ భూములు అమ్ముకుంటే రెస్యూమ్ చేయండి.. కానీ గుంజుకుంటా అంటే ఊరుకునేది లేదంటూ అధికారులపై మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!