Maoist Party Letter: హిడ్మా చనిపోలేదు.. మావోయిస్టు పార్టీ ఓపెన్ లెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Party Gives Clarity On Hidma Death News Via Letter: ఇటీవల ఛత్తీస్గఢ్ బస్తర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మోస్ట్వాంటెడ్గా ఉన్న మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా మావోయిస్టు పార్టీ ఒక లెటర్ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ పేరుతో విడుదలైన ఈ లెటర్లో.. మావోయిస్టు నేత బెటాలియన్ కమాండర్ కామ్రేడ్ హిడ్మా మరణవార్తను ఖండించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులు హిడ్మాను హతమార్చినట్లు దేశమంతా ప్రచారం చేశాయని.. అయితే బస్తర్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో భద్రతా బలగాలు అనుకుంటున్నట్లు ఏమీ జరగలేదని స్పష్టం చేశారు.
IND vs SL 2nd ODI: శ్రీలంకపై భారత్ విజయం.. సిరీస్ కైవసం
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
భద్రతా బలగాలు దాడులకు దిగింది నిజమేనని.. కానీ అందుకు ధీటుగా మావోయిస్టులు తిరగబడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు. అనవసరపు దాడులతో ఆదివాసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. దేశ రక్షణ కోసం ఉండాల్సిన భద్రత.. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో మోహరిస్తున్నారని సెటైర్ వేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విలువైన సంపద ఛత్తీస్గఢ్ ఆటవీ ప్రాంతలో ఉందని, ఈ విలువైన సంపదను దోచుకునే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఆదివాసీలకు చెందాల్సిన సంపదను మావోయిస్టు పార్టీ ఎప్పుడు అండగానే ఉంటుందన్నారు. మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని పోలీసు క్యాంప్గా మార్చేశారని.. నిత్యం దాడులకు దిగుతున్నారని తెలిపారు. ఏకంగా వైమానిక దాడులకు సైతం పాల్పడుతున్నారని ఆ లేఖలో వెల్లడించారు.
Global Warming: గ్లోబల్ వార్మింగ్ కాదు.. గ్లోబుకే వార్నింగ్
కాగా.. కొంతకాలం నుంచి ఛత్తీస్గఢ్ పోలీసులతో కలిపి సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం భద్రతా బలగాల నుంచి హిడ్మా తప్పించుకున్నాడు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా సరిహద్దుల్లో హిడ్మా మకాం వేసినట్లు బలగాలకు సమాచారం అందడంతో.. అక్కడ కూంబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో హిడ్మా హతమయ్యాడని బుధవారం పెద్దఎత్తున ప్రచారం జరిగింది. హిడ్మా మృతి వార్తలను పోలీసు ఉన్నతాధికారులు సైతం రాత్రి వరకు వెల్లడించలేదు. ఈ క్రమంలోనే తాజాగా లెటర్ ద్వారా హిడ్మా సేఫ్గానే ఉన్నాడని మావోయిస్టు పార్టీ క్లారిటీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..