సీఎం కేసీఆర్, పీఎం మోడీ ఉద్యోగాల భర్తీ నీ మర్చిపోయారు అని సీనియర్ అధికార ప్రతినిధి మానవతా రాయ్ అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు. తెలంగాణలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాల ఖాళీల పై శ్వేత పత్రం విడుదల చేయాలి.
ఇక బండి సంజయ్ నిరుద్యోగుల గురించి మిలియన్ మార్చ్ అంటే నవ్వు వస్తోంది. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని..ఇవ్వని బీజేపీకి మిలియన్ మార్చ్ నిర్వహించే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. ఈ నెల 12 న మోడీ హైదరాబాద్ వస్తున్నారు. మోడీ నీ కలిసి వినతి పత్రం ఇద్దాం అని పేర్కొన్నారు.