Bhatti Vikramarka: కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka Comments On CM KCR: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. భద్రాచలం ఎప్పుడూ కాంగ్రెస్కు కంచుకోట అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ రాజకీయ పార్టీ భద్రాచలంకు చేసిందేం లేదని వ్యాఖ్యానించారు. కాలేజీలు, ఆసుపత్రులు, చివరకు గోదావరి నదిపై బ్రిడ్జి కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ.125 కోట్లతో భద్రాచలానికి మంచినీరు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతకాలని అటవీ హక్కుల చట్టం తెచ్చింది కాంగ్రెస్ అని, 3 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిందీ కాంగ్రెస్ పార్టీనేనని చెప్పుకొచ్చారు. కానీ.. దశాబ్దకాలంగా నీళ్లు రాలేదని, నియామకాలూ జరగలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏడు మండలాలు బిల్లులో పెట్టకపోయినా, దొంగచాటుగా బీజేపీ ఆర్డినెన్స్ ఇచ్చిందని మండిపడ్డారు. ఉన్న భద్రాచలాన్ని కూడా కేసీఆర్ మూడు ముక్కలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy: ‘మేం ఓట్లు అడగం’.. కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్
Also Read
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
ఇదిలావుండగా.. త్వరలోనే తాను పాదయాత్ర షెడ్యూల్ను ప్రకటిస్తానని భట్టి విక్రమార్క సోమవారం తెలిపారు. ‘హత్ సే హత్ జోడో అభియాన్’ కార్యక్రమానికి సంబంధించి, తన పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ను త్వరలోనే ప్రకటిస్తానన్నారు. కాళేశ్వరంతో పాటు అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలోనూ తాను పాల్గొంటానని పేర్కొన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సైతం మార్చి 1వ తేదీ నుంచి పాదయాత్ర లేదా బైక్ యాత్ర చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. అటు.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తన నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించనున్నట్టుగా తెలిపారు. తనను ఎవరైనా పాదయాత్రకు రావాలని ఆహ్వానిస్తే, తప్పకుండా వెళ్తానని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది.
Catholic Church : చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపులు.. మతపెద్దలే నిందితులు
తాజావార్తలు
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!