Site icon NTV Telugu

Malla Reddy: ప్రభుత్వ కక్ష చర్య కాదు.. భూకబ్జా ఆరోపణలపై మల్లారెడ్డి

Malla Reddy

Malla Reddy

Malla Reddy: ఇది ప్రభుత్వ కక్ష చర్య కాదని భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూకబ్జా ఆరోపణలపై మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జాతో నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కేసు నమోదైన విషయం వాస్తవం అన్నారు. తను కూడా కోర్టును ఆశ్రయిస్తా అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి పై మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

Read also: Dhanush: కెప్టెన్ మిల్లర్ కమింగ్ సూన్…

మల్లారెడ్డిపైనే కాకుండా.. ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. శామీర్ పేట మండలంలోని కేశవాపురం గ్రామంలో 47 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో.. తహశీల్దార్ తో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శామేడ్చల్ మల్కాజిరి జిల్లా కేశవాపురం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల లంబాడీల వారసత్వ భూమిని మల్లారెడ్డి, అతని అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేశారని తెలిపారు. అందుకు సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. కబ్జాకు పాల్పడిన మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు 9 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Rana: రాక్షస రాజు వచ్చేసాడు… అనౌన్స్మెంట్ అదిరింది

Exit mobile version