Secunderabad Railway Station: అద్భుతం.. గాలి నుంచే నీటి తయారీ.. లీటర్ నీరు ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad Railway Station: ప్రపంచ వ్యాప్తంగా మంచి నీటి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎక్కడ చూసినా నీటి కష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో వేసవి కాలం కావడంతో మంచి నీటి కోసం రైల్వే స్టేషన్లో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అతి తక్కువ ధరకు మంచి నీటిని అందించే కొత్త ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది.
అంటే.. గాలిలోని తేమ నుంచి నీటిని ఉత్పత్తి చేసే ప్రక్రియ. ఇటీవల ప్రతి ఒక్కరూ ఈ కొత్త విధానం గురించి వినే ఉంటారు. అయితే, దక్షిణ మధ్య రైల్వే డివిజన్ తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వాతావరణ నీటి జనరేటర్ కియోస్క్ను ఏర్పాటు చేసింది. ‘మేఘదూత్’ అని పిలువబడే ఈ వాతావరణ నీటి జనరేటర్ను హైదరాబాద్కు చెందిన స్టార్టప్ మైత్రి ఆక్వాటెక్ భారతదేశంలో అభివృద్ధి చేసింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వాటర్ జనరేటర్ను ఏర్పాటు చేశారు.
Also Read
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
Read also: Priyanka Gandhi : జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కేరళ సీఎం బీజేపీతో రాజీపడ్డారు : ప్రియాంక గాంధీ
తాగునీరు దొరక్క పరిసర ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి మైత్రి ఆక్వాటెక్ కంపెనీ ఎండీ ఎం.రామకృష్ణ మేఘదూత్ కు అందుబాటులోకి తేవాలని ఆలోచించారు. ఈ క్రమంలో.. మేఘదూత్ వాటర్ జనరేటర్ పరికరం అందుబాటులోకి వచ్చింది. మేఘదూత్ పోర్టబుల్ అట్మాస్ఫియరిక్ వాటర్ జెనరేటర్ అనేది ప్రీమియం-నాణ్యత గల తాగునీటి పరికరం. అయితే AWG, అట్మాస్ఫియరిక్ వాటర్ హార్వెస్టర్ అనేది గాలిలోని తేమ నుండి త్రాగునీటిని ఉత్పత్తి చేయడానికి డీయుమిడిఫికేషన్ సూత్రాన్ని ఉపయోగించే పరికరం.
కంటికి కనిపించని గాలిలో తేలుతున్న సస్పెండ్ చేయబడిన కణాలను ఫిల్టర్ చేయడానికి యంత్రంలో 1 మైక్రాన్, 12 మైక్రాన్ల రెండు ఫిల్టర్లు ఉన్నాయి. ఇందులో 1 లీటరు నీటిని ఉత్పత్తి చేయడానికి.. కేవలం 0.3 యూనిట్ల శక్తి మాత్రమే అవసరం అవతుంది. అయితే ఈ నీరు మీరు తాగాలంటే.. రూ. 2 నుంచి రూ. 8 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మీ బాటిల్ను తీసుకువెళితే రూ. 5 చెల్లించాల్సీ ఉంటుంది. కానీ అక్కడున్న బాటిల్ కూడా అవసరమైతే రూ. 8 చెల్లింది నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. స్టేషన్లో చాలా తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన నీటిని అందించే ఈ కొత్త పరికరం నీరు తాగడానికి రైల్వే ప్రయాణికులు ఆశక్తి చూపుతున్నారు.
Jagga Reddy: పార్టీలో చేరే వాళ్లు నేడు, రేపు గాంధీ భవన్ కు రావచ్చు.. జగ్గారెడ్డి సూచన
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!