Secunderabad Railway Station: అద్భుతం.. గాలి నుంచే నీటి తయారీ.. లీటర్ నీరు ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad Railway Station: ప్రపంచ వ్యాప్తంగా మంచి నీటి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎక్కడ చూసినా నీటి కష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో వేసవి కాలం కావడంతో మంచి నీటి కోసం రైల్వే స్టేషన్లో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అతి తక్కువ ధరకు మంచి నీటిని అందించే కొత్త ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది.
అంటే.. గాలిలోని తేమ నుంచి నీటిని ఉత్పత్తి చేసే ప్రక్రియ. ఇటీవల ప్రతి ఒక్కరూ ఈ కొత్త విధానం గురించి వినే ఉంటారు. అయితే, దక్షిణ మధ్య రైల్వే డివిజన్ తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వాతావరణ నీటి జనరేటర్ కియోస్క్ను ఏర్పాటు చేసింది. ‘మేఘదూత్’ అని పిలువబడే ఈ వాతావరణ నీటి జనరేటర్ను హైదరాబాద్కు చెందిన స్టార్టప్ మైత్రి ఆక్వాటెక్ భారతదేశంలో అభివృద్ధి చేసింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వాటర్ జనరేటర్ను ఏర్పాటు చేశారు.
Also Read
Read also: Priyanka Gandhi : జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కేరళ సీఎం బీజేపీతో రాజీపడ్డారు : ప్రియాంక గాంధీ
తాగునీరు దొరక్క పరిసర ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి మైత్రి ఆక్వాటెక్ కంపెనీ ఎండీ ఎం.రామకృష్ణ మేఘదూత్ కు అందుబాటులోకి తేవాలని ఆలోచించారు. ఈ క్రమంలో.. మేఘదూత్ వాటర్ జనరేటర్ పరికరం అందుబాటులోకి వచ్చింది. మేఘదూత్ పోర్టబుల్ అట్మాస్ఫియరిక్ వాటర్ జెనరేటర్ అనేది ప్రీమియం-నాణ్యత గల తాగునీటి పరికరం. అయితే AWG, అట్మాస్ఫియరిక్ వాటర్ హార్వెస్టర్ అనేది గాలిలోని తేమ నుండి త్రాగునీటిని ఉత్పత్తి చేయడానికి డీయుమిడిఫికేషన్ సూత్రాన్ని ఉపయోగించే పరికరం.
కంటికి కనిపించని గాలిలో తేలుతున్న సస్పెండ్ చేయబడిన కణాలను ఫిల్టర్ చేయడానికి యంత్రంలో 1 మైక్రాన్, 12 మైక్రాన్ల రెండు ఫిల్టర్లు ఉన్నాయి. ఇందులో 1 లీటరు నీటిని ఉత్పత్తి చేయడానికి.. కేవలం 0.3 యూనిట్ల శక్తి మాత్రమే అవసరం అవతుంది. అయితే ఈ నీరు మీరు తాగాలంటే.. రూ. 2 నుంచి రూ. 8 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మీ బాటిల్ను తీసుకువెళితే రూ. 5 చెల్లించాల్సీ ఉంటుంది. కానీ అక్కడున్న బాటిల్ కూడా అవసరమైతే రూ. 8 చెల్లింది నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. స్టేషన్లో చాలా తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన నీటిని అందించే ఈ కొత్త పరికరం నీరు తాగడానికి రైల్వే ప్రయాణికులు ఆశక్తి చూపుతున్నారు.
Jagga Reddy: పార్టీలో చేరే వాళ్లు నేడు, రేపు గాంధీ భవన్ కు రావచ్చు.. జగ్గారెడ్డి సూచన
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!