Maheshwar Reddy: కేటీఆర్కు ఆ అర్హత లేదు.. అది సోనియాగాంధీ పెట్టిన భిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maheshwar Reddy Counter To KTR Comments: తెలంగాణ మంత్రి కేటీఆర్పై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్కు లేదని బాంబ్ పేల్చారు. సోనియా గాంధీ పెట్టిన బిక్షతోనే.. కేటీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యులు పదువులు అనుభవిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాకుండా కాంగ్రెస్ జోడో యాత్ర చేపట్టాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను మహేశ్వర్ రెడ్డి అలా స్పందించారు. కాంగ్రెస్ చరిత్రలోనే రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.
దేశంలో ఏ ఒక్కరూ చేయని సాహసాన్ని రాహుల్ గాంధీ చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దేశ ఐక్యత కోసం, భారతదేశ నిర్మాణానికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోందన్న ఆయన.. ఈనెల 23న తెలంగాణలోకి యాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. మక్తల్ నుంచి జుక్కల్ వరకు జరిగే ఈ పాదయాత్రలో లక్షలాది మంది పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ పాదయాత్ర విజయవంతం చేయడం కోసం రేపు కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలోనే హైదరాబాద్లో పాదయాత్ర రూట్ మ్యాప్పై స్పష్టత వస్తుందన్నారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
కాగా.. కేసీఆర్ తమ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్పై ఇటీవల కేటీఆర్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో ఒరిగేదేమీ లేదని, దాని బదులు జోడో యాత్ర చేపట్టి ఉంటే బాగుండేదని చెప్పారు. తెలంగాణలో ఆయన ఎన్నిరోజులైనా యాత్ర చేసుకోవచ్చని, అది తమపై ఏమాత్రం ప్రభావం చూపదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్న ఆయన.. రాష్ట్రంలో అస్తిత్వం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందని, దేశంలో మాత్రం ఆ పార్టీ అట్టర్ ప్లాప్ అయ్యిందని విమర్శించారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..