Mahesh Kumar Goud: దీపాదాస్ మున్షీపై ఎన్వీఎస్ఎస్ వ్యాఖ్యలు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Kumar Goud: బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ పై ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. తమ పార్టీ రాష్ట్ర వ్యవహాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీపై అబద్దపు వ్యాఖ్యలు చేశారని ప్రభాకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపా దాస్ మున్శి పైన బీజేపీ నాయకులు ప్రభాకర్ చేసిన ఆరోపణలు వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. దీపాదాస్ మున్శి నిజాయితీ, నిబద్ధత గల నాయకురాలని తెలిపారు. ఆమె తెలంగాణ ఇంచార్జ్ గా ఉండడంతో బీజేపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో స్వీప్ చేయబోతుందన్నారు.
బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని.. దాంతో పిచ్చిలేసినట్టు బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పస లేని, పనికి రాని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పూట గడుపుకోవడానికి బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బీజేపీ నాయకుల మాటలను ఎవరు నమ్మరని అన్నారు. బీజేపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకొము.. జాగ్రత్త… అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రభాకర్ వెంటనే దీపాదాస్ మున్శికి క్షమాపణ చెప్పి తన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
Also Read
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు – కాంగ్రెస్ నాయకులు..
దీపాదాస్ మున్షీపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దివాళా తీయడానికి నిదర్శనమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. తను దీపాస్ మున్షీని బెంగాలీ కాళీ మాతగా అభివర్ణించడం సరికాదని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలు, అబద్ధాలతో బతికే పార్టీ బీజేపీ అని, ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉన్నారని, ఎంపీ టికెట్ కోసమే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు. దీపాదాస్ మున్షీపై చేసిన వ్యాఖ్యలకు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ” దీపదాస్ మున్షీ బెంగాల్ టైగర్. తూటాలు ఎదుర్కొన్న నాయకుడు. అడ్డగోలుగా నోరు పారేసుకుంటే సహించం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు సహకరించిన నాయకురాలు దీపా దాస్ మున్షీ. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్న సర్వేలను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని మధుయాష్కీ గౌడ్ ధ్వజమెత్తారు.
అయితే అయోధ్య రామమందిర అంశాన్ని రాజకీయం చేయడం తగదని, రామమందిర సందర్శనకు ప్రత్యేక దినం లేదని పార్టీ రాష్ట్ర వ్యవహాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయోధ్య రామ మందిరంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పూజలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తుందని ఆమె అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తామని దీపా దాస్ మున్షీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Mohammed Shami: ఆ ఇద్దరు తెలుగు హీరోలు చాలా ఇష్టం: షమీ
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?