Mohammed Shami: ఆ ఇద్దరు తెలుగు హీరోలు చాలా ఇష్టం: షమీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shami Favourite Actors are Prabhs and JR NTR: ‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్ సినిమాల రిలీజ్ అనంతరం హాలీవుడ్ సైతం టాలీవుడ్పై ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు కేజీఎఫ్-1, కాంతార, కేజీఎఫ్-2 చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం అందరి చూపు సౌత్ సినిమాలపైనే ఉంది. సౌత్ సినిమాలకు బాలీవుడ్, హాలీవుడ్ మాత్రమే కాదు.. క్రికెటర్స్ కూడా ఫిదా అవుతున్నారు. టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్లు అంటే చాలా ఇష్టమట.
శిల్పా హిల్స్లోని యుజెనిక్స్ హెయిర్ ట్రాన్స్ప్లెంట్ సెంటర్ను ప్రారంభించేందుకు మొహమ్మద్ షమీ హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంతో తనకున్న అనుబంధం, సౌత్ సినిమాల గురించి స్పందించాడు. ‘నేను ఖాళీ సమయంలో సౌత్ సినిమాలు బాగానే చూస్తాను. తెలుగు, తమిళం నాకు రాదు కాదు కాబట్టి.. దబ్ అయిన మూవీస్ చూస్తుంటాను. సౌత్లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు బాగా నటిస్తారు. క్రికెట్ ఆడే సమయంలో సినిమాల గురించి సరదాగా మాట్లాడుకుంటాం. సౌత్ హీరోల గురించి కూడా చర్చించుకుంటాం’ అని షమీ తెలిపాడు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: Rituraj Singh Dies: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రుతురాజ్ సింగ్ కన్నుమూత!
‘నా బయోపిక్ గురించి ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు లేవు. ఒకవేళ నా బయోపిక్ తీసినా.. ఎవరు నటిస్తే బాగుంటుందో కూడా చెప్పలేను. హైదరాబాద్తో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడికి వస్తే బిర్యానీ తినకుండా వెళ్లను. ఇక్కడి బిర్యానీ చాలా టేస్టిగా ఉంటుంది. నా హెయిర్ ప్లాంటేషన్ సక్సెస్ అయింది. గతంలో కంటే ఇప్పుడు జుట్టు బాగా ఉంది. చికిత్స డాక్టర్ల పర్యవేక్షణలో జరిగింది. అందుకే ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నా. నా రిజల్ట్ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మొహమ్మద్ షమీ చెప్పాడు. గాయంతో బాధపడుతున్న షమీ.. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2024 లో అతడు మైదానంలోకి దిగనున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో షమీ సంచలన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!