Srinivas Goud: సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్నగర్కు ఈ దుస్థితి ఏమిటి..?
- వర్షాలు పడుతుంటే రిజర్వాయర్లను ఈ ప్రభుత్వం నింపుకోవడం లేదు..
- జూరాల, నెట్టెంపాడు, ఆల్మట్టి ప్రాజెక్టుల నుంచి నీళ్లు వృథాగా కిందికి పోతున్నాయి..
- సీఎం సొంత జిల్లా అయిన మహబూబ్నగర్కు ఈ దుస్థితి ఏమిటి?: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud: రాష్ట్రంలో వర్షాలు పడుతుంటే రిజర్వాయర్లను నింపుకోవాలని ఎవరైనా చూస్తారు.. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ముఖ్యంగా కరువు పీడిత జిల్లాలైన మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో వచ్చిన వరదతో రిజర్వాయర్లు నింపే అనవాయతీ ఉండేది గతంలో.. ఇపుడు జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తిన.. నీళ్లు తరలించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు అని విమర్శించారు. ప్రాజెక్టు నుంచి నీళ్లు వృథాగా కిందికి పోతున్నాయి.. ఆల్మట్టి ప్రాజెక్టు, తుంగభద్ర నుంచి నీళ్లు వస్తున్నా.. వాటిని వాడుకోవాలని ఈ ప్రభుత్వానికి లేదు. వస్తున్న నీటిని ఉపయోగించుకోవడంపై కనీసం ఓ సమీక్ష కూడా చేయలేదు అని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
Read Also: CM Omar Abdullah: ఉద్యోగ నియామకాల రిజర్వేషన్ అంశంపై విపక్షాలపై సీఎం ఆగ్రహం..!
Also Read
- Jurala Project : ఎండిన జూరాల.. నీళ్లు లేక విలవిల.. పాలమూరు ఆయకట్టుకు తప్పని జలకష్టం.!
- DK Aruna: పాలమూరుని రాజకీయాల కోసం కేసీఆర్, రేవంత్ వాడుకుంటున్నారు.. నీళ్ల ఇవ్వడం లేదు!
- MLA Anirudh Reddy : కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయి..
- Karthika Pournami: శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివాలయాల్లో భక్తుల పూజలు..
ఇక, జూరాల ప్రాజెక్టుపై ఆధార పడ్డ నెట్టెంపాడు, బీమాలకు నీళ్లు తరలించడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సారి ముందు వర్షాలు పడ్డాయి.. నీళ్లు సద్వినియోగం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. నీళ్లను నదిలోకి వదులుతున్నారు.. యాసంగిలో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారు.. ఈ వర్షా కాలంలో నీళ్ళుండి కూడా ప్రభుత్వం రైతులను సమస్యల పాలు చేస్తోంది అని ఆరోపించారు. సంగం బండకు మరమ్మత్తులు చేయకపోవడంతో నీళ్లు నింపుకోని పరిస్థితి దాపురించింది అన్నారు. ఇక, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో పంపులు సిద్ధంగా ఉన్నా.. కాలువలు తవ్వక నీళ్లు వాడుకోని పరిస్థితి ఉంది.. దేవుడు కరుణించినా పూజారి కరుణించే పరిస్థితి లేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పష్టంగా తేలింది. జూరాలను గత కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమాని పూడికతో నిండి పోయింది.. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ మహబూబ్ నగర్ కు ఈ దుస్థితి ఏమిటీ? అని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!
-
PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
-
Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
-
RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!