భాగ్యనగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఆదివారం రాత్రి ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు అక్షర (23), దిశీర (19) తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు కారులో ఉన్న మరో యువకుడు అభిరామ రెడ్డి , డ్రైవర్ అరికపూడి దుర్గా సాయి కూడా గాయాలపాలయ్యారు.
Dhurandhar 2: పాపం.. ఆ పాక్ లీడర్’కు నిద్ర కరువు.. కూతురు పాత్ర కూడా దెబ్బేసినట్టే?
నార్సింగి పరిధిలోని తెలంగాణ పోలీస్ అకాడమీ (TGPA) జంక్షన్ దాటుతున్న సమయంలో రాత్రి 8:52 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఫార్చూనర్ కారు ముందు వెళ్తున్న ఒక డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ముందు వెళ్తున్న డీసీఎం వాహనం టైరు అకస్మాత్తుగా ఊడిపోవడంతో అది ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోయింది. వెనుక నుంచి వేగంగా వస్తున్న ఫార్చూనర్ కారును డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో అది డీసీఎంను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఫార్చూనర్ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
Dhurandhar 2: పాపం.. ఆ పాక్ లీడర్’కు నిద్ర కరువు.. కూతురు పాత్ర కూడా దెబ్బేసినట్టే?
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి తరలించారు. పెద్ద కుమార్తె అక్షరకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చిన్న కుమార్తె దిశీరకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న అక్షరను పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నార్సింగి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనం అకస్మాత్తుగా ఆగిపోవడం , వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.