Madhu Yaskhi Goud: బీజేపీ, బీఆర్ఎస్లకు ఆ నిధులు ఎక్కడివి? ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhu Yaskhi Goud Questions BJP BRS Parties Over Huge Funds: దేశంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, సమానత్వాలు కలిగించింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. ఒకే నేరంపై వివిధ రాష్ట్రాల్లో కేసులు వేయడం, కోర్టు దాన్ని సమర్థించడం చాలా బాధగా ఉందన్నారు. సూరత్ కోర్ట్ జడ్జిమెంట్ తరువాత తాము హైకోర్టుకు వెళ్లామని, విచారణని కోర్టు 66 రోజులు పెండింగ్లో పెట్టిందని పేర్కొన్నారు. కోర్టులపైన కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉందన్నారు. ఉపా కేసులు పెట్టి, వరవరరావు లాంటి వారిని బీజేపీ జైల్లో పెట్టిందని మండిపడ్డారు. తెలంగాణలో కూడా అనేక మందిపై అర్బన్ నక్సల్ పేరుతో కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
Rahul Gandhi: ప్రధాని అవ్వకుండా రాహుల్పై బీజేపీ కుట్ర.. కాంగ్రెస్ నేతలు ఫైర్
Also Read
- Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
10,130 కోట్లు బీజేపికి ఎలక్ట్రోల్ బాండ్ల పేరు మీద నిధులు వచ్చాయని.. అలాగే 350 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్ల పేరుతో బీఆర్ఎస్ పార్టీకీ నిధులొచ్చాయని మధుయాష్కీ కుండబద్దలు కొట్టారు. ఇంత మొత్తంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రశ్నిస్తే తమపై కేసులు పెడతారా? అని నిలదీశారు. బీజేపీ, బీఅర్ఎస్ పార్టీల నియంత, అవినీతి పాలనపై కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. తాము చేస్తున్న మౌన దీక్ష కేవలం రాహుల్ గాంధీ కోసమే కాదని.. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి స్వేచ్ఛ కోసమని వివరణ ఇచ్చారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మౌన దీక్షలో భాగంగా.. మధుయాష్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Kavya Kalyanram: బాడీ షేమింగ్ రూమర్స్ .. ‘బలగం’ బ్యూటీ క్లారిటీ
అంతకుముందు కూడా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే బీసీలు పార్టీ దగ్గరవ్వాలని మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు. పార్టీకి దూరమైన వర్గాల్ని తిరిగి పార్టీకి దగ్గర చేయాలని రాహుల్ గాంధీ, ఖర్గే ఆదేశించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సామాజిక న్యాయం జరగలేదని, బీసీలను బీఆరర్ఎస్ అణిచివేస్తోందని ఆరోపణలు చేశారు. ఒక కులం మాత్రమే ముందుపడితే.. ఏ పార్టీ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ పార్టీలో బీసీలకే సీఎం పదవులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!