Madhu Goud Yaskhi: బీజేపీ-టీఆర్ఎస్ కుట్రను గమనించాలి
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసే ఉన్నాయని.. వారి కుట్రను ప్రతిఒక్కరూ గమనించాలని టీపీసీసీ ప్రచారకర్త కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడుతోన్న బీజేపీ.. ఆయన్ను జైలుకు ఎందుకు పంపడం లేదని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఏనాడూ ప్రతిపక్షాల తరఫున కేంద్రం వద్ద మాట్లాడలేదని అన్నారు. 8 ఏళ్లుగా పార్లమెంట్లో ప్రధానిని ఏనాడూ కేసీఆర్ ప్రశ్నించలేదన్నారు. ప్రశ్నిస్తున్న వారిపై మాత్రం కాల్పులు జరుపుతున్నారన్నారు.
తెలంగాణ ప్రజల భవిష్యత్ పట్ల కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పిన మధుయాష్కీ.. ధరణి చట్టం వల్ల వేలాదిమంది రైతులకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. అసైన్డ్ భూముల్ని కాంగ్రెస్ పార్టీ పేదలకు పంచిందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం వాటిని లాక్కుంటోందని ఆరోపించారు. మహబూబాబాద్లో 5 వేల ఎకరాల అసైన్డ్ భూముల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల దగ్గర నుండి లాక్కుందన్నారు. రైతు బంధు వస్తోన్న రైతుల దగ్గర నుండి కూడా భూముల్ని తీసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఉదేశ్యపూర్వకంగానే ధరణి తెచ్చి భూములు లాక్కుంటున్నారని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు.
Also Read
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
ఇక ఇదే సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంపై మధుయాష్కీ మాట్లాడారు. తన తండ్రి పీజేఆర్ జ్ఞాపకార్థం కాంగ్రెస్ నేతల్ని విష్ణు పిలిచారని, తండ్రికి తగ్గ తనయుడిగా విష్ణు ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పీజేఆర్ పోరాటం చేశారని, హైదరాబాద్లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలిచ్చారని గుర్తు చేసుకున్నారు.
విష్ణుని చూసి కాంగ్రెస్ యువత ముందుకు రావాలని, రాహుల్ గాంధీ నాయక్వత్వంలో అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్లోకి రావడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారని, పార్టీని నమ్మి పని చేసిన వారికి అన్యాయం జరగదని మధుయాష్కీ గౌడ్ భరోసానిచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో