M. Kodandaram: బెదిరింపులు ఆపి.. చర్చలతో సమస్యను పరిష్కరించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
M. Kodandaram: బెదిరింపులు ఆపి చర్చలు జరిపి ప్రభుత్వం సమస్యను త్వరగా పరిష్కరించాలని టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శుల, ఓ పి ఎస్ ల సమ్మెకు కోదండరాం మద్దతు తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు టీజేఎస్ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శులు వెట్టి చాకిరి చేస్తున్నారని అన్నారు. వారిని రెగ్యులరైజ్ చేసి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. ఆత్మగౌరవ పోరాటాన్ని గౌరవించి పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కోరారు.
Read also: K.Laxman: గత ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తే తెలంగాణ వచ్చేదా?
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ప్రభుత్వము పంచాయతీ కార్యదర్శులకు హామీ ఇచ్చి మాట తప్పుతున్నది ఇది శోచనీయం కాదన్నారు. పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకుని గ్రామస్థాయి నుంచి ఉద్యమం చేస్తామన్నారు. ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య పద్ధతిలోమంచి కాదని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి తీసేయడం అంటే నైజాం పాలనలో ఉన్నామా రాచరిక పాలనలో ఉన్నామా అర్థం కావడం లేదని అన్నారు. బెదిరింపులు ఆపి చర్చలు జరిపి ప్రభుత్వం సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.
Read also: Errabelli Dayakar: జేపీఎస్లను మేము చర్చలకు పిలువలేదు.. ఎర్రబెల్లి క్లారిటీ
తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పది రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. మే9న సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. 9న ఉద్యోగులు విధుల్లో చేరకుంటే విధుల్లో చేరని వారిని తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే..
M. Kodandaram: బెదిరింపులు ఆపి చర్చలు జరిపండి.. సమస్యను పరిష్కరించండి
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!