M. Kodandaram: బెదిరింపులు ఆపి.. చర్చలతో సమస్యను పరిష్కరించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
M. Kodandaram: బెదిరింపులు ఆపి చర్చలు జరిపి ప్రభుత్వం సమస్యను త్వరగా పరిష్కరించాలని టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శుల, ఓ పి ఎస్ ల సమ్మెకు కోదండరాం మద్దతు తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు టీజేఎస్ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శులు వెట్టి చాకిరి చేస్తున్నారని అన్నారు. వారిని రెగ్యులరైజ్ చేసి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. ఆత్మగౌరవ పోరాటాన్ని గౌరవించి పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కోరారు.
Read also: K.Laxman: గత ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తే తెలంగాణ వచ్చేదా?
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
ప్రభుత్వము పంచాయతీ కార్యదర్శులకు హామీ ఇచ్చి మాట తప్పుతున్నది ఇది శోచనీయం కాదన్నారు. పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకుని గ్రామస్థాయి నుంచి ఉద్యమం చేస్తామన్నారు. ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య పద్ధతిలోమంచి కాదని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుంచి తీసేయడం అంటే నైజాం పాలనలో ఉన్నామా రాచరిక పాలనలో ఉన్నామా అర్థం కావడం లేదని అన్నారు. బెదిరింపులు ఆపి చర్చలు జరిపి ప్రభుత్వం సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.
Read also: Errabelli Dayakar: జేపీఎస్లను మేము చర్చలకు పిలువలేదు.. ఎర్రబెల్లి క్లారిటీ
తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పది రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. మే9న సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. 9న ఉద్యోగులు విధుల్లో చేరకుంటే విధుల్లో చేరని వారిని తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే..
M. Kodandaram: బెదిరింపులు ఆపి చర్చలు జరిపండి.. సమస్యను పరిష్కరించండి
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..