Lothukunta Land Case: లోతుకుంట భూముల కేసులో హైడ్రాకు హైకోర్టు షాక్..
- హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర ఆగ్రహం
- కమిషనర్ రంగనాథ్కు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
- తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lothukunta Land Case: హైదరాబాద్లోని లోతుకుంట భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టులో మరోసారి తీవ్రస్థాయిలో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా వ్యవహరించడంపై హైకోర్టు ధర్మాసనం హైడ్రా (HYDRAA) తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విచారణకు హైడ్రా తరఫున అడ్వకేట్ జనరల్ (AG) సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వైఖరిపై న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైడ్రా తీరుపై ఘాటు వ్యాఖ్యలు
విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “రెవెన్యూ, నీటిపారుదల (ఇరిగేషన్) చట్టాలను పక్కనబెట్టి కేవలం హైడ్రా చట్టం ఒక్కటే ఉందా?” అని న్యాయస్థానం ప్రశ్నించింది. హైకోర్టు ఇచ్చే ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రాకు ఒక అలవాటుగా మారిపోయిందని ధర్మాసనం మండిపడింది. ఒకే భూమికి సంబంధించి మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడం అనేది కోర్టు చరిత్రలోనే మునుపెన్నడూ లేదని స్పష్టం చేసింది.
Also Read
- CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
- KTR: 'రాజ్యమా ఉలిక్కిపడు'.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
కోర్టు ఆదేశాలు లెక్కచేయకపోవడం తీవ్ర నేరం
కోర్టు ధిక్కరణ ఉత్తర్వులపై ఉన్నత స్థానాల్లో అప్పీలు చేయకుండా, మళ్లీ అదే భూమిలోకి వెళ్లడం తీవ్రమైన నేరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం ఒక సాధారణ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని, న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను సైతం లెక్కచేయకుండా లోతుకుంట భూముల్లోకి ఎలా వెళ్తారని హైడ్రా అధికారులను ప్రశ్నించింది.
కమిషనర్ క్షమాపణలతో అఫిడవిట్ దాఖలుకు ఆదేశం
ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టును సమయం కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా క్షమాపణలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Lothukunta Land Case: లోతుకుంట భూముల కేసులో హైడ్రాకు హైకోర్టు షాక్..
-
Toxic: ‘టాక్సిక్’కి సెన్సార్ కష్టమేనా?
-
Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
-
UK: లండన్లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!