Prone Zones: అన్న జర చూసి నడపరాదే.. రోడ్డుపై ధాన్యం ఏసిండ్రు
Prone Zones: తెలుగు రాష్ట్రాల్లో ఎండాకాలమో, వర్షాకాలమో చెప్పలేం. అకాల వర్షాల కారణంగా రెండు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఈ అకాల వర్షాల్లే రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. చేతికొచ్చిన పంటలు, ఐకేపీ కేంద్రాలకు తరలించిన వరి ధాన్యం కుప్పలు, కల్లాల్లో ఆరబెట్టిన పంటలన్నీ నీటిపాలైంది. దీంతో రైతులు కన్నీటి పర్వంతమవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కొందరు రైతులు తడిసిన ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబెడుతున్నారు. ధ్యాన్యం ఎండితే కొంత మంచి ధరకైనా పోతుందనే ఆశతో రోడ్లపై ఆరబెట్టి పడిగాపులు కాస్తున్నారు. కాగా.. ఇలా ధాన్యం రోడ్డుపై ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. రోడ్లపై వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
Read also: PM warangal tour: మరోసారి తెలంగాణకు మోడీ.. ఈసారి ఏ జిల్లాలో అంటే..
Also Read
ఇటీవల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే వాహనదారులు కూడా బీ అలర్ట్ గా ఉండాలని అధికారులు చెబుతున్నారు. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టింటారు కాబట్టి చూసి చూడకుండా వాహనం నడిపితే ప్రమాదాల బారిన పడుతున్నారని వెల్లడించారు. రోడ్లపై ధాన్యం కుప్పలు.. చూసి జాగ్రత్తగా ప్రయాణించాలని కోరుతున్నారు. ఇక తాజాగా ఇలాంటి ఘటనే పెదపడల్లి జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డుపై వరికుప్పలను రైతులు ఆరబోసారు. అయితే లారీ నడుపుతున్న డ్రైవర్ ఆ వరికుప్పలను లైట్ తీసుకున్నాడు. వరి కుప్పలపైనుంచే లారీని నడిపాడు. సుల్తానాబాద్ మండలం కనుకుల దగ్గర కలప లోడుతో వెలుతున్న లారీ రాత్రి ధాన్యం కుప్పను ఢీకొట్టింది. దీంతో లారీ ఇక్క సారిగా బోల్తా పడింది. లారీ క్యాబిన్పై నుంచి డ్రైవర్ కిందపడ్డాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fake gang: సైబరాబాద్లో కల్తీ ముఠా… కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!