Prone Zones: అన్న జర చూసి నడపరాదే.. రోడ్డుపై ధాన్యం ఏసిండ్రు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prone Zones: తెలుగు రాష్ట్రాల్లో ఎండాకాలమో, వర్షాకాలమో చెప్పలేం. అకాల వర్షాల కారణంగా రెండు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఈ అకాల వర్షాల్లే రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. చేతికొచ్చిన పంటలు, ఐకేపీ కేంద్రాలకు తరలించిన వరి ధాన్యం కుప్పలు, కల్లాల్లో ఆరబెట్టిన పంటలన్నీ నీటిపాలైంది. దీంతో రైతులు కన్నీటి పర్వంతమవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కొందరు రైతులు తడిసిన ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబెడుతున్నారు. ధ్యాన్యం ఎండితే కొంత మంచి ధరకైనా పోతుందనే ఆశతో రోడ్లపై ఆరబెట్టి పడిగాపులు కాస్తున్నారు. కాగా.. ఇలా ధాన్యం రోడ్డుపై ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. రోడ్లపై వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
Read also: PM warangal tour: మరోసారి తెలంగాణకు మోడీ.. ఈసారి ఏ జిల్లాలో అంటే..
Also Read
ఇటీవల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే వాహనదారులు కూడా బీ అలర్ట్ గా ఉండాలని అధికారులు చెబుతున్నారు. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టింటారు కాబట్టి చూసి చూడకుండా వాహనం నడిపితే ప్రమాదాల బారిన పడుతున్నారని వెల్లడించారు. రోడ్లపై ధాన్యం కుప్పలు.. చూసి జాగ్రత్తగా ప్రయాణించాలని కోరుతున్నారు. ఇక తాజాగా ఇలాంటి ఘటనే పెదపడల్లి జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డుపై వరికుప్పలను రైతులు ఆరబోసారు. అయితే లారీ నడుపుతున్న డ్రైవర్ ఆ వరికుప్పలను లైట్ తీసుకున్నాడు. వరి కుప్పలపైనుంచే లారీని నడిపాడు. సుల్తానాబాద్ మండలం కనుకుల దగ్గర కలప లోడుతో వెలుతున్న లారీ రాత్రి ధాన్యం కుప్పను ఢీకొట్టింది. దీంతో లారీ ఇక్క సారిగా బోల్తా పడింది. లారీ క్యాబిన్పై నుంచి డ్రైవర్ కిందపడ్డాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fake gang: సైబరాబాద్లో కల్తీ ముఠా… కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్
తాజావార్తలు
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!