CM KCR: నేడు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: బీఆర్ఎస్ పార్టీ నేడు మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. లోహా నియోజకవర్గంలోని నాందేడ్లో నిర్వహించే ఈ సభకు ఎక్కువ మంది హాజరయ్యేలా పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశారు. ఈ బహిరంగ సభకు పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే మహారాష్ట్రలో బీఆర్ఎస్ సమావేశం జరగడం ఇది రెండోసారి. అక్కడ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా.. సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ను దేశవ్యాప్తంగా, అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే అన్ని రాష్ర్టాల నేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలతో పాటు ఛత్రపతి శివాజీ వారసులైన నేతలు కూడా ముందుకు వచ్చారు. తెలంగాణకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర గ్రామాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ మొదట మహారాష్ట్రలో తమ పార్టీ కార్యక్రమాల విస్తరణ వైపుగా అడుగులు వేస్తున్నారు.
Read also: Shikhar Dhawan : ప్రేమించండి.. కానీ పెళ్లి మాత్రం చేసుకోకండి..
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
షెడ్యూల్..
ఈనేపథ్యంలో.. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మహారాష్ట్రలోని లోహాకు వెళ్తారు. సాయంత్రం 3 గంటలకు స్థానిక నేతలతో సమావేశమై 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కాగా..ఈ భారీ బహిరంగసభలో పరువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ దేనిపై చర్చించనున్నారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడం వంటి వాటిపై స్పందించే అవకాశం ఉందా? లేదో? మరి చూడాలి. అయితే సీఎం కేసీఆర్ దేనిపై సభలో ఏం మాట్లాడనున్నారో అందరిలో ఆశక్తి నెలకొంది.
Read also: Cashew Rs.30 Per KG: జీడిపప్పు కిలో 30 రూపాయలు మాత్రమే..!
నాందేడ్ లో మొదటి సభ..
అయితే.. నాందేడ్ జిల్లాలో ఫిబ్రవరి 5వ తేదీన మొదటి సారి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈసభకు వేలాది మంది తరలిరావడం, భారీ స్థాయితో సభ సక్సెస్ కావడంతో మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఉన్న నాందేడ్ తో పాటు ఠాణె, అహ్మద్ నగర్, శిర్డీ, బ్రుహన్ ముంబై లాంటి కార్పొరేషన్లలో పోటీకీ సన్నద్ధం అవుతోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈసభను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇటీవలే హైదరాబాద్ లో తన అనుచరులతో సీఎం కేసీఆర్ ను కలిసి తమ వద్ద సభ నిర్వహించాలని లోహా మాజీ ఎమ్మెల్యే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నేత శంకర్ గణేశ్ రావు ధోంగె కోరారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతరు 10 రోజులుగా అక్కడే ఉండి ఇవాళ జరిగే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.
Telugudesam Party:ఈనెల 28న టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ
తాజావార్తలు
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!