Cashew Rs.30 Per KG: జీడిపప్పు కిలో 30 రూపాయలు మాత్రమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cashew Rs.30 Per KG: సాధారణంగా జీడిపప్పు రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన గుండె, బలమైన నరాల ,కండరాల పనితీరు దీనిని తినడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు. అయితే జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా ఇవన్నీ.. సామాన్యులు కొనలేని రిచ్ ఫుడ్స్.. వీటి ధరకు తగ్గట్లే వీటిలో పోషకాలు రిచ్గానే ఉంటాయి. కేజీ కొనాలంటే.. క్వాలిటీని బట్టి.. కనీసం రూ. వెయ్యి అయినా పెట్టాల్సిందే. అయితే మన దేశంలోనే ఒక ప్రాంతంలో మాత్రం కేవలం రూ.30కే జీడిపప్పు దొరుకుతుంది. నమ్మలేకపోయినా అది నిజం. ఇంతకీ అది ఎక్కడ ఉందో తెలుసుకుందాం.
జార్ఖండ్లోని జంతార జిల్లాలోని నాలా అనే గ్రామంలో జీడిపప్పును అత్యంత తక్కువ ధరకు దొరుకుతుంది. అందుకే దీన్ని ‘జార్ఖండ్ జీడిపప్పు నగరంగా పిలుస్తారు. ఈ గ్రామానికి వెళ్తే కిలో జీడిపప్పు కేవలం రూ.20 నుంచి 30లకే లభిస్తుంది. మామూలుగా చెప్పాలంటే కూరగాయల కంటే ఛీపే.. అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రజలు నాలా గ్రామంలోనే జీడిపప్పును కొని తీసుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచే దళారులు అధికంగా కొని బయట ప్రాంతాల్లో వంద రెట్లు అధిక ధరకు అమ్ముతారు.
Also Read
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
Read Also: Apcc Deeksha:మోడీ హయాంలో సీబీఐ, ఈడీలు కీలుబొమ్మలు
అసలు ఎందుకింత తక్కువ
నాలా గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో జీడి తోటలనే వేశారు. 2010లో నాలా గ్రామంలోని వాతావరణం, నేలలు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయని అటవీ శాఖ గుర్తించింది. అంతేకాదు గ్రామస్తులు అందరికీ ఈ విషయాన్ని చెప్పి జీడి తోటను పెంచే విధంగా చేసింది. అలా ఒకేసారి గ్రామం అంతా పెద్ద ఎత్తున జీడి సాగు మొదలుపెట్టారు. ఇందుకోసం అప్పట్లో ఐఏఎస్ కృపానంద ఝా ఎంతో కష్టపడ్డారు. ఆయన జంతారా జిల్లా డిప్యూటీ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ నాలా గ్రామం విశిష్టతను వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని పరిశోధకులతో చర్చించి అక్కడ నేలలు, నీటిని పరీక్షించేలా చేశారు.
Read Also: Rahul Gandhi: దటీజ్ రాహుల్.. డిస్ క్వాలిఫైడ్ ఎంపీ అంటూ ట్విట్టర్ అకౌంట్లో మార్పు
అలా, అటవీశాఖ చొరవ తీసుకొని ఆ గ్రామంలో జీడి తోటలను పెంచేలా చేశారు. అయితే ఇంతగా జీడిపప్పు పండడం వల్ల అక్కడ రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అంతా వచ్చి తక్కువ ధరకే జీడిపప్పును కొని పట్టుకెళ్తున్నారు. అది కూడా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుండడం వల్ల కిలో 30 నుంచి 50 రూపాయలకే అమ్మాల్సి వస్తోంది. అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తే రైతులకు మరింత ఉపాధి అవకాశాలతో పాటు, జీడిపప్పు ధర కూడా పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Mirai 2: ‘మిరాయ్ 2’ వీఎఫ్ఎక్స్ కోసం… తేజ సజ్జా స్మార్ట్ ప్లానింగ్ వైరల్
-
Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
-
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..