Wines Tender : మద్యం షాపుల కోసం మహిళల పోటీ.. ఒకే మహిళ 150 షాపులకు దరఖాస్తు..
- మద్యం దుకాణాల దరఖాస్తులకు భారీ స్పందన
- ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో మహిళ దరఖాస్తు దారుల సందడి
- నిన్నటి వరకు 50 వేల దరఖాస్తులు
- రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం షాపులకు లైసెన్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wines Tender : రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తులకు ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించబడుతున్నాయి. ముఖ్యంగా మహిళా అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఎక్సైజ్ కార్యాలయాలు రద్దీగా మారాయి. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయ సమాచారం ప్రకారం ఇప్పటివరకు 50 వేల దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఈరోజు మరో 50 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు కావడంతో దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఆదాయం చేరింది.
Tirupathi : తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం..మత్తులో ములిగిపోయిన యువత
Also Read
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
ఈసారి రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వనున్నారు. అందుకోసం దరఖాస్తుల స్వీకరణ వేగంగా కొనసాగుతోంది. గౌడ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అయితే సొండి సామాజిక వర్గానికి కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కొందరు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణతో పాటు యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చి దరఖాస్తులు సమర్పించారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ 150 మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాల్లో వీరి ఆసక్తి ఎక్కువగా ఉంది.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక ఈనెల 23న మద్యం దుకాణాల లైసెన్స్ల కోసం డ్రా నిర్వహించనుంది. పారదర్శకత కోసం ఆన్లైన్ డ్రా పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఈసారి లైసెన్స్ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
ఈ మొత్తంలో భాగం రాష్ట్ర ఆదాయానికి గణనీయమైన తోడ్పాటు ఇవ్వనుంది. మద్యం దుకాణాల లైసెన్స్లపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో, ఎక్సైజ్ శాఖ కార్యాలయాల వద్ద వాతావరణం పండుగలా మారింది. ముఖ్యంగా మహిళా దరఖాస్తుదారుల ఉత్సాహం ఈసారి ప్రధాన ఆకర్షణగా మారింది.
Perni Nani: మంత్రి కొల్లు రవీంద్ర ఆస్తులపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!