Wines Tender : మద్యం షాపుల కోసం మహిళల పోటీ.. ఒకే మహిళ 150 షాపులకు దరఖాస్తు..
- మద్యం దుకాణాల దరఖాస్తులకు భారీ స్పందన
- ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో మహిళ దరఖాస్తు దారుల సందడి
- నిన్నటి వరకు 50 వేల దరఖాస్తులు
- రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం షాపులకు లైసెన్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wines Tender : రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తులకు ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించబడుతున్నాయి. ముఖ్యంగా మహిళా అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఎక్సైజ్ కార్యాలయాలు రద్దీగా మారాయి. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయ సమాచారం ప్రకారం ఇప్పటివరకు 50 వేల దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఈరోజు మరో 50 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు కావడంతో దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఆదాయం చేరింది.
Tirupathi : తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం..మత్తులో ములిగిపోయిన యువత
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఈసారి రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వనున్నారు. అందుకోసం దరఖాస్తుల స్వీకరణ వేగంగా కొనసాగుతోంది. గౌడ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అయితే సొండి సామాజిక వర్గానికి కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కొందరు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణతో పాటు యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చి దరఖాస్తులు సమర్పించారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ 150 మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాల్లో వీరి ఆసక్తి ఎక్కువగా ఉంది.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక ఈనెల 23న మద్యం దుకాణాల లైసెన్స్ల కోసం డ్రా నిర్వహించనుంది. పారదర్శకత కోసం ఆన్లైన్ డ్రా పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఈసారి లైసెన్స్ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
ఈ మొత్తంలో భాగం రాష్ట్ర ఆదాయానికి గణనీయమైన తోడ్పాటు ఇవ్వనుంది. మద్యం దుకాణాల లైసెన్స్లపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో, ఎక్సైజ్ శాఖ కార్యాలయాల వద్ద వాతావరణం పండుగలా మారింది. ముఖ్యంగా మహిళా దరఖాస్తుదారుల ఉత్సాహం ఈసారి ప్రధాన ఆకర్షణగా మారింది.
Perni Nani: మంత్రి కొల్లు రవీంద్ర ఆస్తులపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!