Perni Nani: మంత్రి కొల్లు రవీంద్ర ఆస్తులపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..
- మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..
- రూ. 10 కోట్లతో మిల్లు, 20 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు..
- కొల్లు రవీంద్ర చేపట్టే ఒక్క నిర్మాణానికీ ఫ్లాన్లు లేవు..
- చంద్రబాబు, లోకేష్ ఆశ్చర్యపోయేలా కొల్లు రవీంద్ర ఆస్తులు పోగేశాడు: పేర్ని నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నాడని వైసీపీ నేత పేర్నినాని అన్నారు. కొల్లు రవీంద్ర స్వార్ధం కోసం జనంతో ఆటలాడుతున్నారు.. 13వ తేదీన మున్సిపల్ అధికారులతో ఒక నోటీస్ ఇప్పించారు.. జూలైలోనే మున్సిపల్ అధికారులతో కొల్లు రవీంద్ర ఓ ప్లాన్ ను రెడీ చేసుకున్నారు.. బెల్లపుకోట్ల సందును నేను మొదటి సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విస్తరణ చేశా.. 2014లో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు విస్తరణ చేయాలనే ఆలోచన రాలేదు.. రోడ్డు విస్తరణపై పేపర్లో వచ్చే వరకూ ఎవరికీ తెలియదు.. హడావిడిగా పేపర్ ప్రకటనపై మచిలీపట్నం ప్రజల్లో ఆందోళన మొదలైంది.. రూ. 10 కోట్లతో మిల్లు, 20 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, 5 కోట్లతో గెస్ట్ హౌస్ కడుతున్నాడు.. కొల్లు రవీంద్ర చేపట్టే ఒక్క నిర్మాణానికీ ప్లాన్లు లేవు.. చిన్న చిన్న వారిపై ప్రతాపం చూపించే మున్సిపల్ కమిషనర్ కు కొల్లు రవీంద్ర నిర్మాణాలు కనిపించలేదా అని మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు.
Read Also: RC 17: పుష్ప 3 కన్నా ముందే చరణ్ సుక్కు సినిమా
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
ఇక, ప్లాన్లు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే ముడా కళ్లు మూసుకుందా అని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినాని ప్రశ్నించారు. మంత్రి కొల్లు రవీంద్ర అండ చూసుకుని మున్సిపల్ కమిషనర్ రెచ్చిపోతున్నాడు.. సామాన్యులు ఇల్లు కట్టుకుంటుంటే మున్సిపల్ సిబ్బంది వాలిపోతున్నారు అని ఆరోపించారు. స్థానిక టీడీపీ ఇంఛార్జ్ లకు కమిషన్ ఇస్తేనే అనుమతులు ఇస్తున్నారు.. నువ్వు మీ ఇంఛార్జిలకు ఎంత కమిషన్ ఇచ్చావ్ కొల్లు రవీంద్ర.. బడ్డీ కొట్లు కూలగొట్టించి నీ ఇంఛార్జీలకు కమిషన్లు ఇప్పించి మళ్లీ అక్కడే షాపులు పెట్టించావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లు రవీంద్ర కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ కు కనీసం ప్లాన్ లేదు.. తన కాంప్లెక్స్ ప్లాన్ కోసం రోడ్డును విస్తరణ చేయిస్తున్నాడు.. చంద్రబాబు, లోకేష్ ఆశ్చర్యపోయే స్థాయిలో కొల్లు రవీంద్ర ఆస్తులు పోగేశాడు అని పేర్నినాని ఆరోపించారు.
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!