Mission Bhagiratha: లీకైన భగీరథ నీళ్లు.. జలమయమైన రోడ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leaked Mission Bhagiratha water: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటింటికీ మంచినీరు అందించే పథకం రోడ్లపై ఆవిరైపోతోంది. వరంగల్ జిల్లా ఖానా పురం మండలం వేపచెట్టు తండా సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ పగిలి నీరు చిమ్మడంతో ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారి జలమయమైంది. రహదారికి అటు ఇటు వెళ్లడానికి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రహదారిపై ఆరబో సిన వడ్లు తడిశాయని రైతులు తెలిపారు. వడ్లన్నీ నీటిలో కొట్టుకు పోయాయని వాపోయారు. మిషన్ భగీరథ నీరు పైప్ లైన్ ప్రధాన పైప్ కావడంతో నీరు ఎక్కువగా వచ్చాయి. పైప్ లైన్ పగలి నీరు ఎత్తున ఎగిసి పడుతుండటంతో.. రహదారి దాటడానికి గ్రామస్తులు వాహన దారులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. నాసిరకం పైపులు ఏర్పాటు చేయడం వల్ల తరచు పైపు లైన్ పగులుతున్నాయని ప్రజలు తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులను అప్రమత్తం చేశారు. స్థానికులు భగీరధ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
Read also: Bhakthi TV Live: హనుమద్వ్రతం శుభ సందర్భంగా హనుమాన్ చాలీసా వింటే..
Also Read
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
నాలుగు రోజుల కిందటే ఖానాపురంలో పైపు పగిలి 12 ఎకరాల్లో వడ్లు తడిసిన సంగతి మరచిపోకముందే మరోసారి ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ మండల కేంద్రంలోని 365వ జాతీయ రహదారిపై డిసెంబర్ 1న ఉదయం మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అయింది. దీంతో రోడ్డుపై పెద్ద ఎత్తున భగీరథ నీరు ప్రవహిస్తోంది. నెలల తరబడి పంటల కోసం ఎదురుచూస్తున్న రైతులకు మిషన్ భగీరథ పైప్లైన్ కన్నీళ్లు తెప్పించింది. రోడ్లపై ఎండిపోయిన వరిపంటలన్నీ నీరుగా మారాయి. దీంతో 10 ఎకరాల్లో పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపరిహారం చెల్లించాలని రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. మరోవైపు మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయి నీరు వృథాగా పోతోంది.
Andhra Pradesh: నేడు రాయలసీమ గర్జన.. కర్నూలులో భారీ ర్యాలీ
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!