Dr. Laxman: మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు తెలంగాణ లిస్టు ఫైనల్.. క్లారిటీ ఇచ్చిన లక్ష్మణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr. Laxman: సీఈసీ లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లిస్టు తో పాటు తెలంగాణ లిస్టు కూడా ఫైనల్ చేస్తామని బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ తెలంగాణ అభ్యర్థుల జాబితాపై కసరత్తు కొనసాగుతుందన్నారు. సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనున్నాట్లు తెలిపారు. సీఈసీలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లిస్టు తో పాటు తెలంగాణ లిస్టు కూడా ఫైనల్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ అభ్యర్థుల జాబితా పై పూర్తిస్థాయి కసరత్తు జరిగిందన్నారు. గెలుపు గుర్రాలకి సీట్లు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు.
బీసీ ఎజెండాతో తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగుతామన్నారు. ఇతర అన్ని పార్టీలు బీసీలను ఓటు యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారాన్ని కల్పించే దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే మించి బీసీలకు టికెట్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఏ అవకాశం అయినా బీజేపీ లోనే సాధ్యమవుతుందన్నారు. ఎంపీలు సైతం పోటీ చేసే అంశం పైన చర్చలు సాగుతున్నాయని, గెలుపు గుర్రాలే మా ప్రాతిపదిక అని స్పష్టం చేశారు.
Also Read
- Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
- Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ నివాసంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు గురువారం సమావేశమయ్యారు. అనేక సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె. లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్లు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ పాల్గొన్నారు. వీరితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధాన నేతలు పోటీ చేసే నియోజకవర్గాలు, సామాజిక వర్గాల వారీగా సీట్ల కేటాయింపు, మెజారిటీ ప్రజలు టికెట్ ఆశిస్తున్న స్థానాలు… వీటిపై చర్చ జరిగింది. ఆ తర్వాత కోర్ కమిటీ సభ్యులు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను పలుమార్లు కలిశారు. ఈ సమావేశాల అనంతరం గురువారం రాత్రి నడ్డా నివాసంలో కమిటీ మరోసారి సమావేశమైన విషయం తెలిసిందే..
Shriya Saran: కావాల్సిన చోట చూపిస్తూ.. అవసరం లేని చోటు కవర్ చేస్తూ శ్రియ.. నీ డ్రస్ అదుర్స్
తాజావార్తలు
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్తో అదరగొట్టనున్న వివో ఫోన్
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!