Laddu Donga: వినాయక లడ్డూ చోరీ.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక చవితి అంటే మామూలుగా వుండదు.. వినాయకుడిని ప్రతిష్టించి ప్రత్యేకంగా పూజలు చేయడం కామన్. వినాయకుడికి పెట్టే లడ్డూ కూడా చాలా ఫ్యామస్. ఈ లడ్డూని వేలం వేసి లక్షలు పాడుకుంటారు. అలాంటిది విఘ్ననాయకుడి లడ్డూని కొట్టేశాడో దొంగ. అదీ కూడా పబ్లిక్ గా.. సీసీ కెమేరా సాక్షిగా ఆ దొంగ చేసిన పని ఇప్పుడు జగిత్యాలలో హాట్ టాపిక్ అవుతోంది.
జగిత్యాల పట్టణంలో హనుమాన్ వాడ హనుమాన్ దేవాలయం లో వినాయక విగ్రహం ఏర్పాటుచేశారు. ఎప్పటి లాగే వినాయకుడికి లడ్డూ కూడా ప్రసాదంగా పెట్టారు. కానీ ఈ లడ్డూ చోరీకి గురి కావడంపై భక్తులు మండిపడుతున్నారు. స్థానిక హనుమాన్ వాడ లోని హనుమాన్ దేవాలయంలో గల వినాయకుని మండపం లోని గణేష్ లడ్డూ చోరీకి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. తాపీగా వచ్చిన ఒక దొంగ మండపంలోని వినాయక విగ్రహం దగ్గరికి వెళ్ళి.. వినాయకుడి చేతిలోని లడ్డూ కాజేశాడు. లడ్డూ కోసం వచ్చిన దొంగ ముసుగు వేసుకుని వచ్చాడు. లడ్డూ చోరీ చేసుకుని నింపాదిగా అక్కడినుంచి జారుకున్నాడు. మెడలో కండువా, ముసుగు, అతని డ్రెస్ ఆధారంగా ఆ దొంగ పని పట్టే పనిలో వున్నారు పోలీసులు.
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
Read Also: Thirty Five Years for Swayamkrushi : మూడున్నర పదుల ‘స్వయంకృషి’
రెండురోజుల క్రితం సిరిసిల్ల జిల్లా, గోపాల్ నగర్ మండలంలో ఉన్న గణనాథున్ని ఓ దొంగ ఎత్తుకెళ్లిన సంఘటన సంచలనం కలిగించింది. వినాయక చవితి రోజున గణపయ్యకు పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 12 గంటల తర్వాత భక్తులు, నిర్వాహకులు ఇంటికి వెళ్లిపోయారు. వినాయక మండపానికి తలుపులు లేకపోవడంతో అలాగే వదిలేశారు. సాధారణంగా వినాయక మండపంలో పూచిక పుల్ల కూడా కదలదు. ఎవరైనా వస్తే ప్రసాదం తీసుకువెళతారు. అది కూడా అర్థరాత్రి కావడంతో నిర్వాహకులు ఇళ్లకు వెళ్లిపోయారు. తెల్లవారుజామున నిర్వాహకులు మండపానికి వచ్చి చూసేసరికి అవాక్కయ్యారు. వినాయక విగ్రహం అక్కడ కనిపించలేదు. వీధిలోని చిన్నారులంతా కలిసి చందాలు వేసుకుని మండపాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం కనిపించకపోవడంతో అందరం బాధపడ్డామని స్థానికులు చెప్పారు. ఆలయాల్లో హుండీ ఎత్తుకెళ్లడం కామన్.. డబ్బులు, బంగారం, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురి అవుతుంటాయి. కానీ దేవుడినే మింగే దొంగలున్నారని, తస్మాత్ జాగ్రత్త అని ఇతర మండపాల నిర్వాహకులకు సలహాలు చెబుతున్నారు ఈ మండపం నిర్వాహకులు.
Read Also: Uttarakhand: పరువు హత్య.. అల్లుడిని దారుణంగా హత్య చేసిన అత్తమామలు
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!