Thirty Five Years for Swayamkrushi : మూడున్నర పదుల ‘స్వయంకృషి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మరపురాని చిత్రాలను నిర్మించారు. వారి కాంబినేషన్ లో రూపొందిన మరో చిత్రం ‘స్వయంకృషి’. విశ్వనాథ్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన రెండవ చిత్రం ‘స్వయంకృషి’. ఈ చిత్రానికి ముందు వీరి కాంబోలో వచ్చిన ‘శుభలేఖ’ జనాన్ని భలేగా అలరించింది. ‘శుభలేఖ’ తరువాత ఐదేళ్ళకు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి ‘స్వయంకృషి’లో నటించారు. నిజానికి చిరంజీవి లాంటి మాస్ హీరో డేట్స్ ఇస్తే, ఆ రోజుల్లో ఎవరైనా ఓ మాస్ మసాలా మూవీ తెరకెక్కించేసి కాసులు దండుకొనేవారు. కానీ, మొదటి నుంచీ అభిరుచిగల నిర్మాతగా సాగిన ఏడిద నాగేశ్వరరావు మాత్రం చిరంజీవినే కొత్తగా చూపించే ప్రయత్నం చేశారే తప్ప, రాజీపడలేదు. అప్పట్లో చిరంజీవికి ఉన్న ఇమేజ్ కు పూర్తి భిన్నంగా రూపొందిన చిత్రం ‘స్వయంకృషి’. 1987 సెప్టెంబర్ 3న ‘స్వయంకృషి’ జనం ముందు నిలచింది.
‘స్వయంకృషి’ కథ ఏమిటంటే – సాంబయ్య చెప్పులు కుట్టి జీవిస్తూ ఉంటాడు. శారద అనే అమ్మాయిని చదివిస్తాడు. ఏ రోజుకైనా ఆమెను పెళ్ళాడాలన్నదే సాంబయ్య అభిలాష. అయితే శారద తాను చదువుకొనే చోటే ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. వారి పెళ్ళికి సాంబయ్య కూడా అంగీకారం తెలుపుతాడు. సాంబయ్యకు తన చెల్లెలు కొడుకు చిన్నా ఆలనాపాలనా బాధ్యత ఉంటుంది. అదే సమయంలో సాంబయ్య అంటే ప్రాణమిచ్చే గంగ అతనితో పాటే లోకమని భావిస్తుంది. చిన్నాను ఆమె కూడా ఎంతో బాగా చూసుకుంటూ ఉంటుంది. సాంబయ్య జీవితంలో గంగ ప్రవేశించిన తరువాత అతని దశ తిరిగిపోతుంది. ఒక్కోమెట్టు ఎక్కుతూ చెప్పుల దుకాణం నడిపే స్థాయికి చేరుకుంటాడు. ఎంతో ధనవంతుడవుతాడు. ఆ సమయంలో సాంబయ్య చెల్లెలు భర్త గోవింద్ జైలు నుండి వస్తాడు. తన కొడుకును తనతో పంపమంటాడు. అందుకు సాంబయ్య అంగీకరించడు. సాంబయ్య దగ్గరే తన కొడుకు ఉండాలంటే కొన్ని షరతులు ఉన్నాయని చెబుతాడు గోవింద్. తన కొడుకు చిన్నాను తీసుకు వెళ్ళి తప్పుడు మార్గంలో నడిచేలా చేస్తాడు. దాంతో సాంబయ్య, గోవింద్ ను నిలదీస్తాడు. అతనికి కావలసింది డబ్బే అని భావించి, తన యావదాస్తినీ చిన్నా పేరున రాస్తాడు సాంబయ్య. చివరకు మేనమామ సాంబయ్యకు తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటాడు చిన్నా. తండ్రిని ఎదిరిస్తాడు. సాంబయ్య చివరకు తన చెప్పులుకుట్టే వృత్తిలోనే సాగాలనుకుంటాడు. సాంబయ్య చెంతనే చిన్నా కూడా వచ్చి, తానూ చెప్పులు కుట్టే పనికి పూనుకోవడంతో కథ ముగుస్తుంది.
Also Read
- PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో 'పెద్ది' దిగుతున్నాడు!
- Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
- Mega 158: 'మెగా' డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
- Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రంలో సుమలత, సర్వదమన్ బెనర్జీ, మాస్టర్ అర్జున్, చరణ్ రాజ్, జె.వి.సోమయాజులు, బ్రహ్మానందం, ఎమ్వీయస్ హరనాథ రావు, పి.యల్.నారాయణ, ఎస్.కె. మిస్రో, బేబీ భావన, డబ్బింగ్ జానకి, సంయుక్త నటించిన ఈ చిత్రానికి రమేశ్ నాయుడు సంగీతం సమకూర్చారు. సి.నారాయణ రెడ్డి, సిరివెన్నెల పాటలు రాయగా, “మంచి వెన్నెల ఇప్పుడు…” అనే క్షేత్రయ్య గీతం కూడా చిత్రంలో చోటు చేసుకుంది. “పారాహుషారు…”, “సిన్ని సిన్ని కోరికలడగా…”, “హలో హలో డార్లింగ్…”,”సిగ్గు పూబంతి…”,”కాముడు కాముడు…” అంటూ సాగే పాటలు అలరించాయి.
‘స్వయంకృషి’ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా చిరంజీవి తొలిసారి ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్నారు.
తాజావార్తలు
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!