Uttarakhand: పరువు హత్య.. అల్లుడిని దారుణంగా హత్య చేసిన అత్తమామలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dalit man killed by in-laws for marrying upper-caste woman: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పరవు హత్య జరిగింది. అగ్రకులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు దళిత వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అమ్మాయి తల్లిదండ్రులే ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కర్రలతో కొట్టి దారుణంగా యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు.. పెళ్లి చేసుకున్న జంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలో ఉన్నత కులానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నందుకు దళిత వ్యక్తిని.. యువతి తల్లిదండ్రులు హతమార్చారు. పనుఅదోఖాన్ గ్రామానికి చెందిన దళిత రాజకీయా కార్యకర్త జగదీష్ చంద్ర(39) శుక్రవారం భికాయసైన్ పట్టణంలో కారులో శవమై కనిపించాడు. అతని శరీరంపై మొత్తం 25 గాయాలు ఉన్నాయి… లాఠీల వంటి కర్రలను ఉపయోగించి దాడి చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also: Rajasthan: దళిత బాలికలపై వివక్ష.. వడ్డించినందుకు మధ్యాహ్నం భోజనం పారేసిన వైనం
జగదీష్ చంద్ర భార్య తల్లి, ఆమె సవతి తండ్రి, ఆమె సవతి సోదరుడు మృతదేహాన్ని పారేసేందుకు కారులో తీసుకెళ్తుండగా..పట్టుబడ్డారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. హతుడు జగదీష్ చంద్ర ఆగస్టు 21న అగ్ర కులానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఆగస్టు 27న తమ ప్రాణాలకు ముప్పు ఉందని.. భద్రత కోరుతూ దంపతులు పోలీసులు ఆశ్రయించారు. అయితే ఇదిలా ఉంటే అతని అత్తమామలు గురువాంర శిలాపాని బ్రిడ్జి వద్ద జగదీష్ చంద్రను కిడ్నాప్ చేశారు.. ఆ తరువాత తీవ్రంగా కొట్ి చంపారు.
జగదీష్ చంద్ర 2021లో ఉత్తరాఖండ్ పరివర్తన్ పార్టీ అభ్యర్థిగా ఉప్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. దంపతులు ఫిర్యాదును పోలీసులు సీరియస్ గా తీసుకుంటే ఈ ఘటన జరిగేది కాదని హతుని తరుపున వారు ఆరోపిస్తున్నారు. ఈ హత్య సిగ్గు చేటని.. బాధితురాలికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ఉత్తరాఖండ్ పరివర్తన్ పార్టీ నాయకుడు పిసి తివారీ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!