KVP Ramachandra Rao : పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో కాంగ్రెస్కు పూర్వ వైభవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం రుక్కంపల్లి వద్ద అస్వస్థతతో విశ్రాంతి తీసుకుంటున్న భట్టి విక్రమార్కను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2003లో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పవిత్రమైన పాదయాత్ర తరహాలోనే తెలంగాణలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేడు పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నారని చెప్పారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తుందన్నారు.
Also Read : IPL 2023 : దూకుడుగా ఆడుతున్న సీఎస్కే.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..?
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ రాక్షస పాలన, ప్రజా వ్యతిరేక పాలన గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు విడమర్చి చెప్పడంతో పాటు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న అంశాలను భట్టి విక్రమార్క ప్రజలకు పాదయాత్రలో వివరిస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను పాదయాత్రలో తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ఉచిత కరెంటుపై చేసి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చిన తరహాలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన పాదయాత్రలో పోడు భూములు, ధరణి సమస్యలతో ఎదుర్కొంటున్న రైతుల ఇబ్బందులను నేరుగా తెలుసుకోవడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో కూడా గట్టిగా చెబుతున్నారని అన్నారు.
Also Read : Care Hospital: కేర్ ఆస్పత్రిలో కేర్ కనెక్ట్.. అవయవ మార్పిడి రోగుల ఆత్మీయ సమ్మేళనం
అనేక రకాల సమస్యలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని పరిష్కారిస్తామన్న భరోసా ప్రజల్లో కల్పిస్తున్నాడని చెప్పారు. అభిమాన నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న భట్టి విక్రమార్క అనేక అనుభవాలను నేర్చుకున్నారని, తాను చేపట్టిన పాదయాత్రకు అవి ఉపయోగపడుతున్నాయని భావిస్తున్నానని అన్నారు. సరిగ్గా రెండు దశాబ్దాల కిందట ఇదే మే 18న డాక్టర్ వైఎస్సార్ చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు కూడా భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అదే రోజు వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యారని గుర్తు చే20 సంవత్సరాల క్రితం వైయస్సార్ పాదయాత్ర చేసిన సమయంలో అస్వస్థతకు గురైన రోజునే భట్టి విక్రమార్క స్వల్ప ఆస్వస్థత చెందడం యాదృచ్ఛికంగా జరిగిందన్నారు.
ఏఐసీసీఅధ్యక్షులు ఖర్గే ఆశీస్సులు, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తోడ్పాటు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహకారం, కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతం కావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తుందని ఆశించారు.
తాజావార్తలు
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!