Kunamneni Sambasiva Rao: బండి సంజయ్ నీ స్థాయి ఎంత? బీజేపీ లేకపోతే హిందూ మతానికి రక్షణ లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kunamneni Sambasiva Rao Fires On Bandi Sanjay And BJP: కమ్యూనిస్టు పార్టీని తాకట్టు పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘బండి సంజయ్.. నీ స్థాయి ఎంత? నువ్వు మాకు సూక్తులు చెప్తావా?’ అంటూ ధ్వజమెత్తారు. కమ్యూనిస్టు పార్టీని తాకట్టు పెట్టామని చెప్పడానికి సిగ్గు లేదా? అని మండిపడ్డారు. కమ్యూనిస్టుల మీద ఉమ్మేస్తే సూర్యునిపై వేసినట్టేనని అన్నారు. అధికారం కోసం పశువుల గడ్డి తినే మీరు.. కమ్యూనిస్టు పార్టీనే అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులను తిడితే, తల్లికి పెరు పెట్టినట్టు అవుతుందని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ పేరు రోజు తలచుకోండని, అలా చేస్తే కనీసం పుణ్యమైనా వస్తుందని సూచించారు. తమ ప్రధాన శతృవు బీజేపీ మాత్రమేనని, బీజేపీ సిద్ధాంతంపై తమకు కోపమని స్పష్టం చేశారు. మనుషుల మధ్య మతాల కుమ్ములాట తెస్తారా? బీజేపీ లేకపోతే హిందూ మతానికి రక్షణ లేదా? మతం పేరుతో జనాన్ని హింసించకండి అని హితవు పలికారు.
Raviteja73: ప్రతి ధ్వని, ప్రకంపనం అంటున్నారు.. మా రవన్నను ఏం చేస్తున్నారు బ్రో
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
ఇదే సమయంలో.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రస్తావన లేకపోవడంపై కూనంనేని అసంతృప్తి వెళ్లగక్కారు. సీపీఐ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని అనేకసార్లు స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఈరోజు చరిత్ర ఏదీ మర్చిపోవద్దని సూచించారు. అనేకమంది పిల్లలు, జయశంకర్ లాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోయారని.. అందరూ కలిస్తేనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. గాలి, వెలుతురు ఉన్నంతకాలం.. కమ్యూనిజం పార్టీ ఉంటుందన్నారు. కమ్యూనిజం రథచక్రాల కింద పడితే నలిగిపోతారని హెచ్చరించారు. కమ్యూనిస్టు పార్టీ అయిపోయిందంటూ చాలామంది అవాకులు చవాకులు వెళుతున్నారని.. అలాంటి వాళ్లందరూ భద్రాదిలో నిర్వహించిన ప్రజాగర్జన గ్రౌండ్కి వచ్చి కమ్యూనిస్టు పార్టీ బలమేంటో చూడండని అన్నారు. కమ్యూనిస్ట్లు లేకుండా ఈ దేశంలో ఏ హక్కు సాధ్యం కాదన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ను ఖమ్మం తీసుకొచ్చినప్పుడు.. ముందుగా పలకరించింది తామేనని గుర్తు చేశారు. ఉద్యమంలో కటకటాల్లో ఉన్నామని, కమ్యూనిస్టులపై ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు.
Vikarabad Sireesha Case: శిరీష కేసులో కొత్త ట్విస్ట్.. హత్య చేసింది అతడేనా?
ఈ రోజు దశాబ్ది ఉత్సవాల్లో తమ పెరు లేదు, ఊరు లేదని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీల చరిత్ర చరిపితే చరిగిపోదని, కమ్యూనిస్టుది రక్తంతో రాసిన చరిత్ర అని చెప్పారు. పోరాటాలకు ఓనమాలు దిద్దింది ఎర్రజండా అని.. పోడు ఉద్యమం కూడా కమ్యూనిస్టులు కాకుండా ఇంకెవరు చేయలేరని తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు పార్టీల కంచుకోట అని ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..