Minister KTR: నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జి.. నేడు ప్రారంభించనున్న కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఎస్ఆర్డిపి కింద నగరంలో నిర్మించిన 20వ ఫ్లైఓవర్ ఇది. దీనికి తెలంగాణ తొలి హోంమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. ఈ ఫ్లై ఓవర్ ద్వారా విద్యానగర్, ఉప్పల్, నల్లకుంట వెళ్లే ప్రజల ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఇవాళ ఉదయం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి ఇదేనని ప్రభుత్వం చెబుతోంది. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు మొత్తం 2.62 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఇది మొత్తం 81 స్తంభాలతో నిర్మించబడింది. రూ. 450 కోట్లతో నిర్మాణానికి వెచ్చించారు.
Read also: WHO Chief: ఆయుష్మాన్ భారత్ అద్భుత పథకం.. వైద్య రంగంలో డిజిటల్ సేవలు విప్లవాత్మకం
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
ఈనేపథ్యంలో.. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. లాయల్ ట్యాంక్బండ్లోని కట్ట మైసమ్మ దేవాలయం, ఆర్టీసీ క్రాస్ రోడ్ల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమలులో ఉంటాయి. ఈ మేరకు హైదరాబాద్ నగర అదనపు ట్రాఫిక్ కమిషనర్ సుధీర్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఇందిరాపార్క్ వరకు ఎక్స్ రోడ్ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. వాహనదారులు లోయర్ ట్యాంక్బండ్, ఎమ్మార్వో కార్యాలయం, స్విమ్మింగ్ పూల్ మరియు కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఇందిరా పార్క్ ఎక్స్ రోడ్ వైపు వెళ్లాలి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కట్ట మైసమ్మ దేవాలయం వైపు వచ్చే ట్రాఫిక్కు ప్రవేశం లేదు. ఇంటిపార్క్ ఎక్స్ రోడ్డు వద్ద బండ మైసమ్మ, స్విమ్మింగ్ పూల్, తహసీల్దార్ కార్యాలయం, లోయర్ ట్యాంక్బండ్ వైపు వాహనాలను మళ్లిస్తారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని పోలీసులు సూచించారు.
Ladies Special Bus: కోఠి- కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్.. ఈ నెల 21 నుంచి 127K నెంబర్..
తాజావార్తలు
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!