KTR : తిరుపతిరెడ్డికి అధికారులు వంగి వంగి దండం పెడుతున్నారు
- వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్రెడ్డి పోటీ చేయరు
- రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే, కొడంగల్కు సీఎం తిరుపతిరెడ్డి
- వార్డు మెంబర్ కూడా కానీ తిరుపతిరెడ్డికి అధికారులు వంగి వంగి దండం పెడుతున్నారు. -కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ భవన్లో కొడంగల్ నియోజకవర్గ నాయకుల జాయినింగ్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ ప్రజల జోష్ చూస్తుంటే మామూలుగా లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కానీ, కొడంగల్కు సీఎం తిరుపతి రెడ్డి అని ఆయన సెటైర్ వేశారు. ఒక వార్డు మెంబర్, ఒక కౌన్సిలర్ కూడా కాని ఆయనకు అధికారులు వంగి వంగి దండం పెడుతున్నారు అని ఎద్దేవా చేశారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
కొడంగల్ భూములను తొండలు గుడ్లు పెట్టని భూములు అని రేవంత్ రెడ్డి అన్నాడని, అలాంటి మాటలు మాట్లాడిన ఆయనకు ప్రజలు సరైన సమాధానం చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని గుర్తు చేస్తూ, “ఇక్కడ మీరు ఒక్క ఎంపీటీసీ కూడా గెలిపించకపోతే ఢిల్లీ లెవల్లో తెలుస్తుంది” అన్నారు. అంతేకాకుండా.. “మనమే కట్టిన ప్రాజెక్టులు, మనమే చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించడానికి రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ మనకు చాలా బాకీ పడింది. ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డు చూపించండి, వారి మోసాన్ని తిరిగి చూపించండి” అని అన్నారు.
హైదరాబాద్లో ఇటీవల జరిగిన వరదలపై కూడా కేటీఆర్ ఆరోపణలు చేశారు. “హైదరాబాద్లో భారీ వర్షం వచ్చినా ఏమి కాకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను పూర్వం కట్టారు. వాతావరణ శాఖ క్లౌడ్బరస్ట్ హెచ్చరించినా ఆ రెండు చెరువులను నింపి ఉంచారు. కావాలనే ఒక్కసారిగా నీటిని వదిలి నగరాన్ని ముంచేశారు. మూసీ పక్కన ఉన్న వారిని ఖాళీ చేయించేందుకే ఈ ప్లాన్ చేశారు. మూసీ ప్రాజెక్టు కోసమే నీళ్లు వదిలారు” అని కేటీఆర్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!