KTR : రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఇవాళ్టి పరిణామాలే సాక్ష్యం
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్పై కేటీఆర్ ఆరోపణలు
- దాడులు, కిడ్నాప్లతో ప్రజాస్వామ్యం ప్రమాదంలోనని విమర్శ
- ఎక్స్ అఫీషియో ఓట్లపై దొంగ ఓట్ల ఆరోపణ
- పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచకాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో ఈరోజు జరిగిన దాడులు, కిడ్నాప్లే నిదర్శనమని ఆయన విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ‘గూండాగిరి’కి పాల్పడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో సంచలనం.. ముగ్గురు తెలుగు స్టూడెంట్స్కు 100% పర్సంటైల్
Also Read
- CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
- TGSRTC Strike: నేడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? సమ్మెపై క్లారిటీ ఇచ్చిన జేఏసీ!
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు , సీనియర్ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన భౌతిక దాడులను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక.. కిడ్నాప్లు, దాడులు , దొంగ ఓట్లతో పదవులను కొల్లగొట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీలు, ఎంపీల ‘ఎక్స్ అఫీషియో’ ఓట్ల పేరుతో దొంగ ఓట్లను నమోదు చేసుకుని చైర్మన్ పదవులను దక్కించుకోవాలని చూడటం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు.
కొందరు పోలీస్ అధికారులు కాంగ్రెస్ నేతల తొత్తులుగా మారి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి అధికారులపై డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, అధికార పార్టీకి అనుకూలంగా చైర్పర్సన్ల ఎంపిక ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేసిన అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారం శాశ్వతం కాదని, కాంగ్రెస్ సాగిస్తున్న ఈ అరాచకానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగిస్తున్న ఈ పాలకుల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజల కోర్టులో కాంగ్రెస్ ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు.
Loot Deal: సరికొత్త ‘ఓపెన్ ఇయర్’ బడ్స్.. జిమ్, రన్నింగ్కు బెస్ట్ ఆప్షన్.!
తాజావార్తలు
-
MI vs CSK: రోహిత్, ధోనీ ఆడతారా?.. ముంబై-చెన్నై మ్యాచ్కు ముందు కీలక అప్డేట్!
-
Divyanka Sirohi : గుండెపోటుతో హీరోయిన్ మృతి..
-
TVK Vijay: “ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర”.. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
-
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదే!
-
Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?