Minister KTR: మానవత్వం చాటిన కేటీఆర్.. గాయపడిన మహిళకు చేయూత
KTR Showed His Humanity By Saving Injured Woman In Munugode: సమస్యల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారు. ట్విటర్ మాధ్యమంగానే కాదు, నేరుగానూ ఆయన చేయూతని అందించారు. ఇప్పుడు మరోసారి కేటీఆర్ మానవత్వాన్ని చాటిచెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన భార్యాభర్తల్ని ఆదుకున్నారు. మంగళవారం మునుగోడులో తన ప్రచారం ముగించుకొని, కేటీఆర్ హైదరాబాద్కి తిరుగు పయమన్నారు. మార్గ మధ్యంలో ఓ జంట ప్రమాదానికి గురై, రోడ్డు పక్కన పడి ఉండటాన్ని ఆయన గమనించారు. దీంతో.. వెంటనే కాన్వాయ్ ఆపి, ఆ జంటను పరామర్శించారు. కల్వకుర్తికి చెందిన తాము, తమ పాపని హాస్టల్లో దించేసి తిరిగి ఇంటికి వెళ్తున్నామని, ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని ఆ మహిళ తెలిపింది. ఆమె చేతికి తీవ్ర గాయం కావడంతో.. తన కాన్వాయ్ వాహనంలోనే భార్యాభర్తల్ని హైదరాబాద్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపదలో ఉన్నవారిని ఆపద్భాంధవుడిలా కాపాడారంటూ.. కేటీఆర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆపద్బాంధవుడు @KTRTRS 🙏
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
మంత్రి కేటీఆర్ గారి మునుగోడు ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. బైక్ పై వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో గాయపడింది చూసి తన కారును ఆపి స్వయంగా తన కాన్వాయ్ వాహనంలో హైదరాబాద్ లోని హాస్పిటల్ కి తరలించారు pic.twitter.com/RfbFSCeYsq
— Thirupathi Bandari (@BTR_KTR) November 1, 2022
మంత్రి కేటీఆర్ ఇలా ఆదుకోవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా.. రక్తమోడుతున్న ఇద్దరు విద్యార్థుల్ని తన కాన్వాయ్లోనే ఆసుపత్రికి తరలించారు. గతేడాది నవంబర్ నెలలో.. మియాపూర్కు చెందిన ఇద్దరు విద్యార్థులు హకీంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలోనే కేటీఆర్ కాన్వాయ్ అటునుంచి వెళ్లింది. అప్పుడు ఆ విద్యార్థుల్ని గమనించిన కేటీఆర్, వెంటనే తన కారుని ఆపేశారు. ప్రమాదం గురించి వారిని అడిగి వివరాలు తెలుసుకున్న ఆయన.. ఆ విద్యార్థుల్ని తన ఎస్కార్ట్ వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు.. మూత్రపిండ సమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారిని కూడా ఆర్థికంగా ఆదుకున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన దర్శనం శ్రీనివాస్, సవిత దంపతులకు అవంతిక అనే నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఆమె కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని, చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. ట్విటర్ మాధ్యమంగా ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. తన కార్యాలయాన్ని సంప్రదించి, పూర్తి సహాయం పొందాలని భరోసానిచ్చారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!