Minister KTR: మానవత్వం చాటిన కేటీఆర్.. గాయపడిన మహిళకు చేయూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Showed His Humanity By Saving Injured Woman In Munugode: సమస్యల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారు. ట్విటర్ మాధ్యమంగానే కాదు, నేరుగానూ ఆయన చేయూతని అందించారు. ఇప్పుడు మరోసారి కేటీఆర్ మానవత్వాన్ని చాటిచెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన భార్యాభర్తల్ని ఆదుకున్నారు. మంగళవారం మునుగోడులో తన ప్రచారం ముగించుకొని, కేటీఆర్ హైదరాబాద్కి తిరుగు పయమన్నారు. మార్గ మధ్యంలో ఓ జంట ప్రమాదానికి గురై, రోడ్డు పక్కన పడి ఉండటాన్ని ఆయన గమనించారు. దీంతో.. వెంటనే కాన్వాయ్ ఆపి, ఆ జంటను పరామర్శించారు. కల్వకుర్తికి చెందిన తాము, తమ పాపని హాస్టల్లో దించేసి తిరిగి ఇంటికి వెళ్తున్నామని, ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని ఆ మహిళ తెలిపింది. ఆమె చేతికి తీవ్ర గాయం కావడంతో.. తన కాన్వాయ్ వాహనంలోనే భార్యాభర్తల్ని హైదరాబాద్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపదలో ఉన్నవారిని ఆపద్భాంధవుడిలా కాపాడారంటూ.. కేటీఆర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆపద్బాంధవుడు @KTRTRS 🙏
Also Read
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
మంత్రి కేటీఆర్ గారి మునుగోడు ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. బైక్ పై వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో గాయపడింది చూసి తన కారును ఆపి స్వయంగా తన కాన్వాయ్ వాహనంలో హైదరాబాద్ లోని హాస్పిటల్ కి తరలించారు pic.twitter.com/RfbFSCeYsq
— Thirupathi Bandari (@BTR_KTR) November 1, 2022
మంత్రి కేటీఆర్ ఇలా ఆదుకోవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా.. రక్తమోడుతున్న ఇద్దరు విద్యార్థుల్ని తన కాన్వాయ్లోనే ఆసుపత్రికి తరలించారు. గతేడాది నవంబర్ నెలలో.. మియాపూర్కు చెందిన ఇద్దరు విద్యార్థులు హకీంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలోనే కేటీఆర్ కాన్వాయ్ అటునుంచి వెళ్లింది. అప్పుడు ఆ విద్యార్థుల్ని గమనించిన కేటీఆర్, వెంటనే తన కారుని ఆపేశారు. ప్రమాదం గురించి వారిని అడిగి వివరాలు తెలుసుకున్న ఆయన.. ఆ విద్యార్థుల్ని తన ఎస్కార్ట్ వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు.. మూత్రపిండ సమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారిని కూడా ఆర్థికంగా ఆదుకున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన దర్శనం శ్రీనివాస్, సవిత దంపతులకు అవంతిక అనే నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఆమె కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని, చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. ట్విటర్ మాధ్యమంగా ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. తన కార్యాలయాన్ని సంప్రదించి, పూర్తి సహాయం పొందాలని భరోసానిచ్చారు.
తాజావార్తలు
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!