KTR: నూకల ఎగుమతిపై కేంద్రం నిషేధం.. అదే కారణమని కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూకల ఎగుమతిపై నిషేధం విధించింది కేంద్రం.. ఎగుమతి పాలసీ సవరించిన కారణంగా నూకల ఎగుమతిపై నిషేధం విధించినట్లు పేర్కొంది.. వెంటనే నిషేధం అమల్లోకి వచ్చినా.. ఉత్తర్వులు రాకముందు నౌకల్లోకి ఎక్కించిన నూకలను సెప్టెంబర్ 15 వరకు అనుమతించబడతాయని స్పష్టం చేసింది.. గత ఏడాదితో పోలిస్తే ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో.. ధరలు పెరగకుండా నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే, కేంద్రం తాజాగా నిర్ణయంపై సీరియస్గా స్పందించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతోనే దేశంలో ప్రస్తుతం ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది మండిపడ్డారు.. నరేంద్ర మోడీ సర్కార్ కు ముందుచూపు లేకపోవడంతో ప్రమాదంలో దేశ ఆహార భద్రత అని పేర్కొన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత ఆలోచనలతో ఆహార ధాన్యాలను కొనకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు.
Read Also: Ganesh Laddu Rs. 46 lakh: బాలాపూర్ గణేష్ రికార్డు బ్రేక్.. రూ.46 లక్షలు పలికిన గణపతి లడ్డూ..
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ఇక, తెలంగాణ విఫలమైందని చూపే ప్రయత్నంలో నరేంద్ర మోడీ సర్కార్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని ఆరోపించారు కేటీఆర్.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని ఆరు నెలల కిందట తాము కోరితే.. దేశంలో అవసరానికంటే ఎక్కువ ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పి కేంద్రం తిరస్కరించిందని.. ప్రస్తుతం కొరతకు కారణమేంటో చెప్పాలంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను డిమాండ్ చేశారు. దేశంలో నాలుగేళ్ల వరకు సరిపోయే నిల్వలు ఉన్నాయని చెప్పారు.. నాలుగేళ్లకు సరిపోయే గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరు నెలల క్రితం గొప్పగా చెప్పిన కేంద్ర సర్కార్.. తాజాగా బియ్యం ఎగుమతులను నియంత్రించి 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించిందని మండిపడ్డారు.. ఎఫ్సీఐ గోదాముల్లో, ఇతర కేంద్రాల్లో బియ్యం, నూకలు, గోధుమల నిల్వలు భారీగా తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా ఆహార ధాన్యాల కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే సేకరణ విధానం “వన్ నేషన్- వన్ ప్రొక్యూర్మెంట్” అనుసరించాలని సూచించిన ఆయన.. తెలంగాణలో పుట్లకొద్దీ పండిన ధాన్యాన్ని కొనకుండా దేశ ప్రజల ఆహార భద్రతను కేంద్రం పణంగా పెట్టిందన్నారు.. ఇప్పటికైనా దేశ ప్రజల ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్తో చిరంజీవి, రామ్ చరణ్కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!