KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
- హామీలపై కేటీఆర్ ఫైర్
- హైడ్రాపై తీవ్ర విమర్శలు
- రైతుబంధు నిలిచిపోయిందన్న ఆరోపణ
- కాంగ్రెస్పై మాఫియా కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : మల్కాజ్గిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, ప్రభుత్వాన్ని ఒక మాఫియాతో పోల్చారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని కేటీఆర్ మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. “ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులవుతున్నా ఇచ్చిన గ్యారంటీల ఊసే లేదు. దీనిపై ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే అడ్డమైన తిట్లు తిడుతున్నారు. వంద రోజుల్లో పిల్లలు పుడతారా అంటూ వింత మాటలు మాట్లాడుతున్నారు” అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను తిట్టుకుంటూ తిరిగితే చాలు, పాలన చేయనక్కర్లేదు అనే చందాన సీఎం వ్యవహార శైలి ఉందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన పనులకు రిబ్బన్లు కట్ చేయడానికి సీఎం తన జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Also Read
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి శూన్యమైందని, కేవలం అప్పులే పెరిగిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ కొద్ది కాలంలోనే ప్రభుత్వం దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని పేర్కొన్నారు. “హైదరాబాద్ నగరంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టి ఇవ్వలేదు గాని, ‘హైడ్రా’ పేరుతో ఉన్న ఇళ్లను మాత్రం నిర్దాక్షิญ్యంగా కూల్చుతున్నారు” అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను ‘దండుపాళ్యం ముఠా’తో పోల్చిన ఆయన, ఈ ప్రభుత్వాన్ని ఒక మాఫియా నడుపుతోందని, ఆ మాఫియాలో రేవంత్ రెడ్డి ఒక పిల్ల నాయకుడు అని تీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం దగ్గర గోణి సంచులు కూడా లేవని, ఆ సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయని విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన ‘రైతుబంధు’ డబ్బు బంద్ అయిపోయిందని, ఆ పైసలన్నీ రాహుల్ గాంధీ ఖాతాలో ‘టింగ్ టింగ్’ అని పడుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, రైతులు ధాన్యం కుప్పలపైనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మంచి, చెడు ఏంటో పూర్తిగా అర్థమైందన్న కేటీఆర్, కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలంతా కథానాయకులు కావాలని పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి ప్రజలు , బిఆర్ఎస్ కార్యకర్తలు ఎటువంటి రౌడీలు, గుండాలకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పరంగా నిలబడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
PM Modi: నీట్ విద్యార్థుల కోసం ఎయిర్పోర్టులోనే ఆగిన ప్రధాని మోడీ..
-
Virat Kohli: వన్డే జట్టులో కోహ్లీ రికార్డుల వేట.. ఇంగ్లాడ్ పై ఆ ఘనత సాధిస్తాడా..?
-
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్పై నాన్ – బైలబుల్ వారెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు! అసలేం జరిగిందంటే..
-
Uddhav Shiv sena: ముగింపుకు ఉద్ధవ్ సేన సంక్షోభం.. మీడియా ముందుకు తిరుగుబాటు ఎంపీలు..
-
Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశారా?
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!