KTR : కాంగ్రెస్ పని అయిపోయింది.. సర్వేల్లో బీఆర్ఎస్కు 78 సీట్లు ఖాయం
- కాంగ్రెస్పై కేటీఆర్ విమర్శలు
- 78 సీట్లు వస్తాయని కీలక వ్యాఖ్యలు
- సర్వే నివేదికలపై సంచలన ఆరోపణలు
- కేసీఆర్ను కోరుకుంటున్న ప్రజలు: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని, రాష్ట్రంలో ఆ పార్టీ పని ఇక అయిపోయినట్లేనని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జిల్లా పార్టీ నేతలతో జరిగిన ముఖ్యమైన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సగం పదవీ కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తన పరిపాలన, నాయకత్వంపై ఒక విస్తృతమైన సొంత సర్వే చేయించుకున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఆ సర్వేలో ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమైందని ఆయన పేర్కొన్నారు.
సర్వేల ఫలితాలు.. బీఆర్ఎస్ ప్రభంజనం
ఇదే సమావేశంలో పలు సర్వేల వివరాలను కేటీఆర్ ప్రస్తావించారు. ఆ వివరాలు ప్రకారం.. ముఖ్యమంత్రి చేయించుకున్న సొంత సర్వే ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితి సుమారు 78 సీట్లను కైవసం చేసుకుని అత్యంత సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలిందన్నారు. కేవలం సీఎం సొంత సర్వేలోనే కాకుండా.. రెండు ప్రముఖ మీడియా సంస్థలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ విభాగాలు క్షేత్రస్థాయిలో చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే పచ్చి నిజం వ్యక్తమైందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, మరోసారి ప్రజలంతా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్నారని అన్ని సర్వే నివేదికలు తేల్చిచెప్పాయని కేటీఆర్ వివరించారు.
Also Read
- Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్తో సైలెంట్ మోడ్లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
- CM Revanth Reddy: కొడంగల్లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
- Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
- OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
సర్వేల భయంతోనే సీఎం అడ్డగోలు మాటలు
సగం పరిపాలనా కాలం ముగిసేసరికే ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. సొంత సర్వేతో పాటు మిగతా అన్ని నివేదికల్లోనూ వ్యక్తమైన ఈ ఊహించని ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత వారం రోజులుగా తీవ్ర నిరాశతో, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పతనాన్ని ఆపడం ఎవరి వల్లా కాదని ఆయన జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
-
Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్తో సైలెంట్ మోడ్లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
-
MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
-
Irumudi 2: రామ్ చరణ్తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!