KTR : అది పూజకు పనికిరాని పువ్వు లాంటిది
- పచ్చి జూటా మాటలతో అధికారంలోకి కాంగ్రెస్
- బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి మోసం
- అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
- “పువ్వు గుర్తు పూజకు పనికిరాదు” – కేటీఆర్ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆత్మగౌరవ పోరాటంగా తీసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. జూబ్లీహిల్స్లో ప్రచార సభలో మాట్లాడుతూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “పచ్చి జూటా మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో బుల్డోజర్లతో పాలన చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకోవాలి — కార్ కావాలా? లేక బుల్డోజర్ కావాలా?” అని ఆయన అన్నారు.
“ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య జరిగేవి కావు. ఇది ప్రజల గౌరవం కోసం జరుగుతున్న పోరాటం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తానని రేవంత్ రెడ్డి మోసం చేశాడు. పార్లమెంట్లో చేసే పనిని అసెంబ్లీలో చేస్తే చెల్లదని ఆయనకే తెలుసు. ఆజారుద్దీన్కి ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా కోర్టులో నిలవదు. అతనినీ మోసం చేశాడు. తెలిసి తెలిసి మోసం చేయడమే రేవంత్ పాలసీ,” అని కేటీఆర్ అన్నారు.
Also Read
- OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ... బీఆర్ఎస్ భారీ స్కెచ్?
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
అంతేకాదు, కాంగ్రెస్ నేతలపై అవినీతి ఆరోపణలు కూడా గుప్పించారు. “ఈ రెండేళ్లలో వాళ్లు ఫుల్గా డబ్బులు సంపాదించారు. ఇప్పుడు ఆ డబ్బులతో ఓటుకు పది వేల రూపాయలు ఇస్తున్నారు. ఆ డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేయండి. పువ్వు గుర్తుకి అసలు ఓటు వేయొద్దు — అది పూజకు పనికిరాని పువ్వు లాంటిది,” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్కు గట్టి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని, రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Rishab Shetty : జై హనుమాన్ సినిమాపై రిషబ్ క్లారిటీ.. రెండేళ్లు అంటూ..
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?