KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
- కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్
- నెరవేరని హామీలపై తీవ్ర విమర్శలు
- రేవంత్కు ఓపెన్ ఛాలెంజ్.. అసెంబ్లీ రద్దు చేయాలన్న డిమాండ్
- 27 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమన్న కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (KTR) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఒక హై-వోల్టేజ్ ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా ప్రజలకు ఇచ్చిన ప్రామిసెస్ ఏవీ నెరవేర్చలేదని, స్టేట్లో కంప్లీట్గా గవర్నెన్స్ ఫెయిల్ అయిందని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఎన్నో కీలకమైన వాగ్దానాలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా కామన్ పీపుల్ని ఇబ్బంది పెడుతున్న పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ విషయంలో కాంగ్రెస్ లీడర్స్ అప్పట్లో చేసిన స్టేట్మెంట్స్, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. రేట్లు తగ్గించాల్సింది పోయి ప్రజలపై మరిన్ని భారాలు వేస్తున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు బ్రతకలేని సిట్యుయేషన్ క్రియేట్ అయిందని విమర్శించారు.
Also Read
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్లో రోడ్డెక్కిన యువత
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. “మీ కాంగ్రెస్ పరిపాలనపై, మీ డెవలప్మెంట్స్ పై మీకు అంత నమ్మకం ఉంటే.. దమ్ముంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఫ్రెష్గా ఎలక్షన్స్కి వెళ్దాం” అంటూ సవాల్ చేశారు. అప్పుడు ప్రజల కోర్టులోనే తేల్చుకుందామని, ఈసారి పబ్లిక్ తీర్పు ఎలా ఉంటుందో చూసేందుకు తాము రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి గనుక ఎన్నికలకు సిద్ధమైతే, తమ వైపు నుంచి యాక్షన్ ప్లాన్ కూడా రెడీగా ఉందని కేటీఆర్ ప్రకటించారు. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ప్రస్తుతం తమ పార్టీకి ఉన్న 27 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజైన్ చేసి, అందరం కలిసి ఒకేసారి జనాల్లోకి వెళ్దామన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో ఈ ఎలక్షన్స్ ద్వారా తేలిపోతుందని, సీఎం ఈ సవాల్ను స్వీకరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
-
Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
-
Shehbaz Sharif: భారత్పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
ట్రెండింగ్
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!